అమావాస్య రోజున దయ్యం తరిమిన ఉపాధ్యాయుడు…
శభాష్ టీచర్ ఉపాధ్యాయులకు ఆదర్శం
Thovva web news.in// 05 sep.Thu
ఆ బడికి వెళ్లాలంటే విద్యార్థుల్లో వణుకు విద్యార్థులు చెప్పే కథలతో మాస్టర్లకు కూడా భయం పట్టుకుంది. విద్యార్థులకు ఏ క్లాస్ చెప్తే ఆ క్లాస్ టీచర్ పేరుతోనే పిలుస్తారు అలాంటిది ఒక మాస్టర్ కి దెయ్యం మాస్టారు అని బిరుదు చేశారు? జిల్లాలోనే సరికొత్త గోస్ట్ టీచర్ …
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు దెయ్యం మాస్టారుగా మారుమోగిపోతున్నారు. ఇంతకీ ఆయనకు ఈ బిరుదు రావడం వెనుక కథేంటో చూద్దాం.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్పూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బలంగా గాలి వీచినా విద్యార్థులకు భయమే. చెట్టుకొమ్మల చప్పుడు వినిపిస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సాయంత్రమవుతుందంటే చాలు, అయిదో తరగతి గది వైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వెన్నులో వణుకు. పుడుతుంది ఎందుకంటే ఆ పాఠశాలలో దయ్యం తిరుగుతోందని విద్యార్థుల భయం. అది ఐదోతరగతిలోనే నివాసం ఉంటోదని వారి అపనమ్మకం. దీంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడే పరిస్థితికి ఏర్పడింది విద్యార్థుల్లో భయం పోగొట్టాలంటే ఎవరికి సాధ్యపడటం లేదు ఉపాధ్యాయులు ఎంత చెప్పినా వినని విద్యార్థులు ఉపాధ్యాయులానే హడలేతిస్తూన్నారు.
భయం తో విద్యార్థులు
రవీందర్రెడ్డి అనే ఉపాధ్యాయుడు జులై రెండున అక్కడికి బదిలీపై వెళ్లారు. అదేరోజు ఏడో తరగతిలో పాఠం బోధిస్తుండగా, ఓ శబ్ధం వినిపించటంతో వెనక బెంచీల్లో కూర్చున్న విద్యార్థలంతా ఒక్క పరుగున ముందుకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు ఎవమయిందని ఆరాతీస్తే, అయిదో తరగతి గదిలో దెయ్యం ఉందని విద్యార్థులు భయం భయంగా చెప్పారు. ఉపాధ్యాయుడు దయ్యాల్లేవని ఎంత చెప్పిన విద్యార్థులు నమ్మలేదు.
అమావాస్య రోజు దయ్యాన్ని తరిమిన ఉపాధ్యాయుడు
మరి ఏంచేస్తే నమ్ముతారంటే, అమావాస్య రోజున ఒక్కరే నిద్రపోతే నమ్ముతామని విద్యార్థులు చెప్పారు. దీంతో జులై అయిదో తేదీన అమావాస్య రోజున రవీందర్రెడ్డి ఒక్కరే నిద్రపోయి విద్యార్థుల్లో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారు. అమావాస్య రోజున రవీందర్రెడ్డి ఒక్కరే పాఠశాలలో నిదురపోవటం, తెల్లారాక ఆయనకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది.
విద్యార్థులు భయం పరార్…
అంతుకుముందు ఉపాధ్యాయులు సైతం ఎలాంటి దెయ్యాల్లేవని చెప్పినప్పటికీ, రవీందర్రెడ్డి ఆచరణాత్మకంగా చూపించటం ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణమైన మార్పువచ్చింది. ఇప్పుడు చిన్నారులు పాఠశాలకు ధైర్యంగా వస్తున్నారు. ఉల్లాసంగా విద్యాలయ ప్రాంగణంలో తిరుగుతున్నారు. వారి దయ్యం బాధ పరారైందిఆనంద్పూర్ పాఠశాలలో ఇప్పుడు ఎలాంటి దెయ్యం భయంలేదు. పిల్లల్లోనూ నూతన ఉత్తేజం నిండింది.ఓ ఉపాధ్యాయుడు చేసిన గుణాత్మకమైన బోధన విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చిందని ఇతర ఉపాధ్యాయులు ప్రశంసిస్తుంటే, తనకు దెయ్యం మాస్టర్ అనే బిరుదు వచ్చిందని రవీందర్రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. రవీందర్ రెడ్డి చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో మూఢవిశ్వాసాలపై నమ్మకం పోయింది. గ్రహణం వీడిన చంద్రుని వలె వారిలోని అపనమ్మకాలు తొలగిపోయాయి. రవీందర్రెడ్డి చేసిన పని రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆయన ఇటీవల పదోన్నతిపై ఆనంద్పూర్ బడినుంచి దీపాయిగూడకు వెళ్లటమే విద్యార్థులను కొంత ఆవేదనకు గురిచేసింది.
నిజమైన ఉపాధ్యాయులు విద్యార్థుల గుండెల్లో నిలిచిపోతారని ఆనందపుర్ పాఠశాల ఉదంతమే సజీవ సాక్ష్యం…
తొవ్వ ప్రత్యేక ప్రతినిధి . హెంచంద్ర పాండే. ఆసిఫాబాద్

