బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే…..
6 గ్యారంటీల అమలు చేతకాక,”హైడ్రా” విగ్రహాల” డ్రామా..
Thovva web news in //16; sep.Mon 4;30 pm

ప్రజాపాలన దేనికోసం, ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదన్నారు.కాంగ్రెస్కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా తానే హాజరవుతా అన్నారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
నిన్నటివరకూ హైడ్రా – నేడేమో విగ్రహాల రాజకీయమా?
సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనమని ఆరోపించారు. దమ్ముంటే ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని లోపాయికారీ ఒప్పందాలతోనే కాలం వెల్లదీస్తున్నాయని ఆరోపించారు. కావాలనే హైడ్రా, విగ్రహాల పేరిట రోజుకో లొల్లి పెట్టుకొని, ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా, ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇస్తారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాం కేసులో ఇరు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉందని ఎద్దేవా చేశారు.