- సివిల్ సప్లై కు సరఫరా కానీ 18వేల క్వింటాళ్ల బియ్యం
- సుమారు రూ.6.49కోట్ల ధాన్యం నిల్వలు శూన్యం
- మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు
- రాష్ట్ర సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఎం ప్రభాకర్
తొవ్వ.మహబూబాబాద్.ప్రతినిధి,సెప్టెంబర్ 09.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యల్లంపేట శివారులోని లక్ష్మి పారబాయిల్డ్ రైస్ మిల్లుపై శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్, టాస్స్ ఫోర్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఎం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2022-23 రబీ సీజన్ కు సంబంధించి లక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు ఎఫ్ సీఐ నుంచి 62,578క్వింటాళ్ల ధాన్యం కోటా కేటాయించటం జరిగింది. సదరు ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులో పట్టించి 42,553 క్వింటాళ్లు సివిల్ సప్లై కోటా కింద ఎఫ్ సీఐ కు సరఫరా చేయాలన్నారు. కానీ 24,336క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేయటం, మిగతా కోటా బియ్యం పంపక పోవటంతో ఎఫ్సీఐ నుంచి అనుమతి నిలిపివేయటం జరిగింది. మిగతా 18,217క్వింటాళ్ల బియ్యం సరఫరా కు సంబంధించి మిల్లులో ధాన్యం 26,784క్వింటాళ్లు స్టాక్ ఉండాలని, కానీ మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవటంతో ఆ ఏడాది ఆర్థిక సమీకరణాలను అనుసరించి రూ.6.49కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని అధికారి వెల్లడించారు. దీనికి సంబంధించి మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక పోలీసులకు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో డీఎం కృష్ణవేణి, ఎస్ఐ జంగయ్య, డీసీఎస్సీ ప్రేమ్ కుమార్, ఏఎస్ఓ రమేష్, టీఏ శంకరయ్య, మరిపెడ తహసీల్దార్ సైదులు, ఎస్ఐ బొలగాని సతీష్, తదితరులున్నారు.

