ప్రొఫెసర్ సాయిబాబా జీవితం సామాజిక పోరాటమే…
Thovva web news.in//12;oct.sat,9;30pm

ఈ దేశంలో అణగారిన వర్గాలు చైతన్యవంతమైన భావజాలం అలవర్చుకొని ప్రశ్నించే గొంతుకలు కావాలని కుల వ్యవస్థ నిర్మూలన జరిగి అంతరాలు అభ్యున్నతి సమాజం కోసం నిరంతరం పాటుపడిన ఈ దశాబ్దం ఆచార్యులలో ప్రొఫెసర్ గొల్లకొండ నాగ సాయిబాబా ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనీ ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన అయన ఐదు సంవత్సరాల వయస్సు లోనే పోలియో మహమ్మారికి బలైన. 90 శాతం పోలియో ఉండి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి జ్ఞానంతో జీవించే హక్కు ఉందని నమ్మి ఆచరించి విద్యా విధానాన్ని అవబోసన పట్టి ఉన్నత విద్యావంతుడిగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా అయన చేసిన సేవలు నేటి విద్యార్థులకు అయన చెప్పిన పాటలు కేవలం బతుకు పాటలు కాకుండా బతికించే పాటలు గా నిలిచాయి

వీల్ చైర్ తోనే ఉన్నత విద్య వంతుడు గా …
అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ (ఎస్కెబిఆర్) కళాశాలలో ఇంటర్ , డిగ్రీని యూనివర్సిటీలో ఉన్నత స్థాయిలో పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో MA పట్టా పొందాడు .ఢిల్లీ విశ్వవిద్యాలయం లో థీసిస్ “ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్: రీడింగ్ ది డిసిప్లిన్” అనే అంశంపై ఉంది పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ పొందారు…
తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ వెనుదన్ను…
ప్రొఫెసర్ సాయిబాబా తెలంగాణ ఉద్యమానికి చాలా ప్రేరణగా నిలిచారు ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీలను అన్యాయాలను అక్రమాలను సందర్భనుసరంగా ఖచ్చితంగా ప్రశ్నించేవారు వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ రాజ్యాంగాన్ని వరంగల్ డిక్లరేషన్ గా అభిమానించి తెలంగాణ ప్రజలకు కావాల్సిన న్యాయమైన డిమాండ్లను ఎలిగేతిచ్చాటారు. ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ అయ్యుండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న సాయిబాబా ను ఈ ప్రాంత ఆచార్యలోకం అభినందించింది….

ప్రజా చైతన్య ఉద్యమాలు…
ముంబై రెసిస్టెన్స్ 2004 సమయంలో , వరల్డ్ సోషల్ ఫోరమ్కు సమాంతరంగా నిర్వహించిన 310 రాజకీయ ఉద్యమాల వేదిక , సాయిబాబా చురుకైన ఆర్గనైజర్గా పాల్గొన్నారు. ఈ కాలంలో అతను ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్ ( ILPS ) లో భాగమయ్యాడు.2009లో, ఆపరేషన్ గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో , ప్రధానంగా భారత రాజ్యం చేసిన సైనిక చర్యలకు వ్యతిరేకంగా అతను ఒక ప్రముఖ స్వరం.వినిపించారు దేశంలోనే ఖనిజ సంపద కలిగిన రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లో జరుగుతున్న ఆదివాసీ నరమేధం కేవలం శాంతి భద్రతలు, తీవ్రవాదం కాదని ఖనిజ సంపద దోపిడీకి రాజ్యం చేస్తున్న కుటిల యుద్ధంలో భాగమైనదని ఈ దేశ సంపద దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక దమన ఎత్తుగడ వేసిందని అది గ్రహించి ప్రజలకి వివరిస్తున్న క్రమంలోనే తనపై ఉప చట్టం అర్బన్ నక్సల్స్ అంటూ కేసులు జోడించి శారీరక హింసను చేసిందనీ అయన ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పారు.అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదల అయిన అయన జైలు లో తనపై చేసిన హింస కు 90%పోలియో తో బాధపడుతూ కనీసం బాత్ రూం కి వెళ్ళలేని దుస్థితి కలిగించి అనేక అనారోగ్య సమస్యలను తీసుకు రావడమే కాకుండా మెడికల్ కిల్లింగ్ చేశారని, ప్రొఫెసర్ తుది శ్వాస విడిచే వరకూ బాధపడ్డాడు జైలు నుంచి విడుదల అయిన అయన తన కుటుంభం తో కంటే హాస్పిటల్ లోనే ఎక్కువగా గడిపారు…శనివారం ఆయన 8;30 కి తుది శ్వాస విడిచారు.. ఆయన మరణం హక్కుల కోసం పోరాడే ఒక నేతను ఒక ఆచార్యుని కోల్పోవడం జరిగింది…
(ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు…ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.
(తోవ్వ అక్షర నివాళి)


