
యాంటీ డ్రగ్ సోల్జర్ డాక్టర్ పులుసం సాంబయ్య
కొత్తగూడ అక్టోబర్ 28 తొవ్వ :
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టి జి యన్ ఎ బి )పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో “డ్రగ్ అబ్యూస్ ఇన్ యూత్ అనే అంశం పై తెలంగాణ లోని అన్ని జిల్లాలలోని యం ఈ ఒ లకి, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అందరికి డా “మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ లో నాలుగు విడతలలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో టి జి న్యాబ్ డైరెక్టర్, డి యస్ పి, యస్ పి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విజయవంతంగ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న యాంటీ డ్రగ్ సోల్జర్ డాక్టర్ పులుసం సాంబయ్య ప్రింట్ మీడియా తో మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం, దేశం,రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య డ్రగ్ మాపియ, డ్రగ్ వినియోగం,అలాగే చాలా మంది యువత, కాలేజీ విద్యార్థులు ఈ డ్రగ్ మహ్మ్మరికి ఆకర్షతులై మత్తుకు బానిసలు గా మారి వారి జీవితాలను,బంగారం లాంటి భవిష్యత్ ను,కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దీని ప్రభావం రాష్ట్ర, దేశ సమ గ్రాభివృద్ధి పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
