శ్రీకాంతాచారి త్యాగాన్ని ఈ ప్రభుత్వమైనా గుర్తించాలి
- తోవ్వ గార్ల ప్రతినిధి ఎడ్ల రాజశేఖర్ -డిసెంబర్4
- మలిదశ ఉద్యమకారుడు కొమర్రాజు జగదీష్
- స్వరాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి బతుకులు మారుతాయని పెట్రోల్ పోసుకుని బలిదానం చేసుకున్న కాసొజు శ్రీకాంతాచారి త్యాగాన్ని ఆనాటి మోసపూరిత ప్రభుత్వం గుర్తించలేదని మలిదశ ఉద్యమకారుడు కొమర్రాజు జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలకేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి మాట్లాడుతూ స్వాలాబాలలకోసం కేసీఆర్ 1200మంది విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులను ప్రేరేపించి వారి సమాధులపై పునాదులు నిర్మించుకుని వందలకోట్ల ఆస్తులు కుదబెట్టుకున్నారే తప్ప వారి కళలను నెరవేర్చే ప్రయత్నం పదేళ్లలో ఒక్కరోజైనా చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగలొస్తాయి బతుకులు మారుతాయని ఉద్యమాలు చేసినవరంతా నిరుద్యోగులుగా కూలీలుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నాటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా శ్రీకాంతాచారి బలిదానాన్ని గుర్తించి డిసెంబర్ 3ను ప్రభుత్వ దినంగా ప్రకటించి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులు అర్పించేలా చూడడమే కాక ఆయన ఆశయాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యామకరులను గుర్తించి వారికి లబ్ధి చేస్తానని ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణలో ప్రతీ ఇంట్లో ఒకరికైనా ఉద్యోగం ఉండేలా చూసి అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, విద్య వైద్యం వైపు అడుగులు వేసి బంగారు తెలంగాణగా ప్రపంచానికి చూపాలని కోరారు.