ప్రమాదానికి గురైన జర్నలిస్టుకు పరామర్శ
– ధైర్యం చెప్పిన రాంసింగ్
తొవ్వ ప్రతినిధి (ఎడ్ల రాజశేఖర్) గార్ల డిసెంబర్8

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలి వేళ్ళు కోల్పోయిన గార్ల మండల జర్నలిస్టు దువ్వ సతీష్ ను విశ్రాంతి ఇన్కంట్యాక్స్ ఉద్యోగి గంగావత్ రాంసింగ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని తన జర్నలిస్టు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్లూజే(ఐజేయు) జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, మండల నాయకులు ఎడ్ల రాజశేఖర్, మలిదశ ఉద్యమకారుడు ఉద్యమకారుల ఫోరం ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ కొమర్రాజు జగదీష్, టిజెఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళీ తారక రామారావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గంగవత్ పత్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.