భయాందోళనలో రైతులు,ప్రజలు…
Thovva.webnews.. Dec 29,sun

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి సంచారం హడలెత్తిస్తుంది. వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు ప్రజలు పులి భయంతో సాయంత్రం కాగానే బయటికి రావాలంటే వణుకు పుడుతున్నందుకు హడలెత్తిపోతున్నారు ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం కాకతీయ స్కూలు వెనకాల..నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంట పొలాల్లో నుంచి ఖానాపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం చేసినట్టు సీసీ కెమెరాల రికార్డు నమోదయింది. ఆడ పులి కోసం మగా పులి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని తడోభ అడవుల నుంచి ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు పంట పొలాల్లో పులి అడుగులగుర్తింపు.భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు.పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు, పోలీస్ అధికారులు.
