కరస్పాండెంట్:టి.ఉమేష్ శర్మ…


కేసముద్రం పట్టణంలో శ్రీ దన్వి టేస్టీ డిలైట్ రెస్టారెంట్ ప్రారంభం..
– ముఖ్యఅతిథిగా మెపా వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్.
– Thovva web news.12/01/2025.
కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం నాడు మార్కెట్ రోడ్ లో మండల రమేష్ ముదిరాజ్ యజమానిగా శ్రీ ధన్వి టేస్టీ డిలైట్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ జాతి బిడ్డలు వాణిజ్య వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని, పేరు చివరన ముదిరాజ్ అని రాసుకోవాలని, ఎదుగుతున్న ముదిరాజ్ బిడ్డలకు మెపా ఎల్లవేళలా అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా మండల రమేష్ ముదిరాజ్ నీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షు చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దుండి అశోక ముదిరాజ్, మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు సింగని మహేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి గైరబోయిన మహేందర్ ముదిరాజ్, యాకయ్య ముదిరాజులు పాల్గొన్నారు.

లక్ష డప్పుల గొంతుల సభను విజయవంతం చేయాలి*
•ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు.
Thovva web news.12/01/2025.
లక్ష డప్పుల గొంతుల సభను విజయవంతం చేయాలని కేసముద్రం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొమ్ము నాగరాజు అన్నారు.ఆదివారం నాడు మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పుల గొంతుల మహాసభను డప్పుల ప్రదర్శన చేస్తూ ఊరు చాటింపు చేసి తప్పనిసరిగా అన్ని గ్రామాలలో ఉన్న మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు అందరు కూడా అధిక సంఖ్యలో పాల్గొని లక్ష డబ్బుల గొంతుల సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కంటిపూడి అరుణ్ మాదిగ విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపాక శంకర్ హాజరై మాట్లాడుతూ… ఈ మహాసభకు సంబంధించి సన్నాహక సమావేశానికి ఈనెల 17వ తారీకు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపద్యంలో మాదిగ ప్రజలందరూ హాజరుకావాలని 30 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడం లేదు కాబట్టి లక్ష డబ్బుల వెయ్యి గొంతుకల సభను విజయవంతం చేస్తే రాష్ట్రం ప్రభుత్వం తలవంచి ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెడుతుందని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి వలంతా శ్రీనాథ్ మండల సీనియర్ నాయకులు కొమ్ము వీరస్వామి మాదిగ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు వల్ల రవి మాదిగ ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పందుల సంజీవ, కేసముద్రం విలేజి మాజీ ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్, వల్లందాస్ మహేష్ మాదిగ ,పందుల శ్రీను మాదిగ ,మామిళ్ళ ప్రేమ్ ,పెండాల రవికుమార్, వల్లందాస్ నవీన్ ,కొమ్ము సంజీవ పెండాల బన్నీ, కొమ్ము చరణ్ ,వడ్డూరి సైదులు, గూడెల్లి సోమయ్య, వల్లందాస్ యశ్వంత్, వల్లందాస్ పండు, కొమ్ము మధు తదితరులు పాల్గొన్నారు.

నంది పురస్కారం అందుకున్న వరంగంటి రాఘవేంద్రాచార్యులు.
Thovva web news.12/01/2025.
మండలంలోని అర్పణ పల్లి గ్రామానికి చెందిన జ్యోతిష్య పురోహితులు వరంగంటి రాఘవేంద్ర చార్యులు హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో శనివారం జరిగిన తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 2025 తెలుగు వెలుగు నంది పురస్కార మహోత్సవంలో నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవలను గుర్తించినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ తెలుగు వెలుగు వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ ,విశ్వ కళా విరాట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వంగాల శాంతి కృష్ణ, కవి గుర్రం జాషువా వారసురాలు అమృత పూడి రేవతి సాహితీ వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ
Thovva web news.12/01/2025.
: మండలంలోని కోరుకొండ పల్లి గ్రామంలో కే సముద్రం లయన్స్ క్లబ్, ఆర్సిఎం, బిఎంఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని సుమారు 300 మందికి ఉచిత మధుమేహ బీబీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర రావు, క్లబ్ ప్రెసిడెంట్ మామిడి అశోక్ ,సెక్రటరీ లక్కాకుల సత్యనారాయణ, ఫాస్ట్ జెర్సీ ఎర్నం శ్రీరాములు, చిర్ర ఏకాంతం గౌడ్, మాకూరి నరసయ్య, మదిపెద్ది వెంకటేష్, దాసరి స్రవంతి, బిఎంఐ హెల్త్ న్యూట్రిషన్ అడ్వైజర్ కృష్ణ, రామకృష్ణ, న్యూట్రిషన్ షాపు నిర్వాహకులు మధుకర్, హెల్త్ అడ్వైజర్ సౌజన్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.