మొదటి బాగం

ధనుర్మాసం ముగిసింది.ఈ సారి వెంకటాచలం వెళ్లి స్వామి ని దర్శించి ధనుర్మాస దీక్ష పూర్తి చేద్దామనుకున్న నా తోడుగా ఓ ఇద్దరు మిత్రులు కూడా వస్తా అన్నారు.ఇక సంక్రాంతి వెళ్లిన మూడవ రోజు బయలు దేరడానికి సిద్ధమైనం అప్పటికే వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల తోపులాటలో 6 గురి మృతి కొంత కలిసివేసింది మేము ఎటువంటి ముందస్తు బుకింగ్ చేసుకోలేదు.. ఎలాగోలా స్వామి దర్శనం చేస్కోవాలనుకున్నం.అందులో ఓ మిత్రుడు ట్రెయిన్ టిక్కెట్లు ఆన్లైన్ లో బుక్ చేశారు. అవి తీరా మేము వెల్లె రోజు వరకు బుక్ కాలేదూ ఇక ఎలా అయినా వెళ్ళ లని నిర్ణయించుకొని పద్మావతి జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కాము కుర్చోవాడనికి సీట్లు దొరికాయి. ఇక ఎలాగోలా తిరుపతి చేరుకున్నాం.విష్ణు నివాసం కాంప్లెక్స్ కి వెళ్ళాం అక్కడ సర్వదర్శనం కోసం అడుగగా మేము వెళ్ళిన తేధికి మరో రెండు రోజులు వరకు సర్వ దర్శనం లేదని తెలుపడం తో ఏమి చేయాలని అనుకొని అంతకు మునుపే మా స్నేహితుల్లో ఒకరు అరుణాచలం వెళ్దం అన్నారు..అప్పటికే ఆయనకు పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేసిన అనుభవం వుండటం తో వెంటనే అరుణాచలం వెళ్దామని నిర్ణయించుకున్నాం.అనుకున్నదే తడువుగా అరుణాచలం ప్రయాణానికి సన్నద్ధం అయ్యం అక్కడే ఫ్రెషప్ అయ్యి తిరుపతి బస్ స్టేషన్ కి వచ్చాం బస్ స్టేషన్ లో డైరెక్ట్ గా అరుణాచలం బస్ లు లేవు వేలూరు వెళ్లి అక్కడి నుంచి అరుణాచలం బయలు దేరాం. నా జీవితంలో మొదటి సారిగా ఒక రాష్ట్రం దాటుతున్నాను అనే ఫీలింగ్ తో వున్నాను తమిళనాడు లోకి మా బస్ వచ్చింది అక్కడ ఎక్కడ చూసినా వారి భాష మమకారం నాకు కనిపించింది. కట్పాడు లో ముఖ్యంగా పెరియార్ ముఖ్య శిష్యుడు డీఎంకే వ్యవస్థాపకుడు అన్నదురై విగ్రహం చూడటం తో తొలిసారి ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక స్థానం తీసుకున్న తీరు నాకు ద్రావిడ ప్రజల ప్రాంతీయ అభిమానం కి హాట్సాఫ్ చెబుతూనే మన తెలుగు వారీ భాష అభిమానం గుర్తుకి వచ్చింది తెలుగు మాట్లాడకుండా వచ్చి రాని ఆంగ్ల భాషను వెతుకుతున్నారు దీనిపై కాళోజీ తెలుగు భాషా మాట్లకపోతే చావు అనే సామెత గుర్తుకి వచ్చింది ఇక తమిళనాడులో ఒక టాయిలెట్స్ పై తప్ప మిగిలిన అన్ని రకాల బోర్డు లు వల్ల ద్రావిడ భాషలోనే వున్నాయి… వేలూరు దాటుతూ నాకు అక్కడి కోట కోట చుట్టూ ప్రవహిస్తున్న నది లాంటి కందకం శతురాజులను ఆ కందకం లోని మొసళ్ళకు ఆహారంగా వేస్తారని చరిత్ర తెలుసుకొని ఇప్పటికీ వారి చరిత్రని కాపాడేలా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దారు..వేలూరులో మరో ముఖ్యమైన దేవాలయం నారాయణి అమ్మ గోల్డెన్ టెంపుల్ మేము చూడక పోయినా వాటి గురించి విన్నాం ఇక అక్కడే వేలూరు లో దిగి మరో బసు కి మారం ఈసారి మా బస్సు తిరువన్నమలై దారిలో పల్లెటూరు ల్ని కలుపుతూ వెళ్తుంది అక్కడి గ్రామాల్లో వాతావరణం నాకు బాగా నచ్చింది ముఖ్యంగా వాళ్ళ వేషధారణ సంస్కృతి సంప్రదాయాలు నన్ను నమస్కరించే లాచేశాయి….మహిళలు ముఖానికి పసుపు పూసుకొని పెద్ద బొట్టు నిండుగా చీర కప్పుకుని ప్రతి మహిళ ఒక ఏం ఎస్ సుబ్బు లక్ష్మి ల కనిపించింది ఇక అలా వెళుతూ మా బస్మొత్తానికి అరుణ చలం లోకి ప్రవేశించాం.అరుణ చలం రాగానే ఒక అలౌకిక మైన అనుభూతి నాలో ప్రవేశించింది బస్సు దిగా గానే పెద్ద అరుణ గిరీ పర్వత శిక నన్ను శివుని సన్నిధికి జరిపింది. మేమూ అన్న అర్చి వద్ద దిగి అంతకు ముందే మా స్నేహితుడు రూం బుక్ చేయడం తో రూం కోసమని అన్న ఆర్చి వద్ద దిగాము.పక్కనే 6అడుగుల కరుణ నిది కాంస్య విగ్రహం నన్ను కట్టిపడేసింది. కరుణ ఒక రచయిత ద్రావిడ ఉద్యమ నాయకుడే కాకుండా పెరియార్ ముఖ్య శిష్యుడు. ఆయన అనేక వందల తమిళ కధలు రాశాడు. ఇక అక్కడైతే మా రూం కి వెళ్ళడం ఫ్రెష్ అయి. దేవాలయం వెళ్లి దర్శించుకోవాలని ఫుల్ తమిళ్ సంప్రదాయ ంలో వెళ్ళాం. వెళ్తుండగా దారిలో మాకు అనేక మంది విదేశీయులు కనిపించారు వీరు ఇక్కడ ఎదుకున్నారు అనుకుంటూ వెళ్తుండగా కొంత ఆకలిగా అనిపించింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి తెలుగు రాష్ట్రంలో మాదిరిగా తమిళ్ నాడు లో రుచికరమైన ఆహారం దొరకదు కొన్ని హోటల్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి ముఖ్యంగా తెలుగు వారి కోసమైతె హోటల్ రమణ టవర్స్ , హోటల్ ఆలయం చాలా బాగుంటుంది… ఇందులో స్ట్టే కూడా చేయవచ్చు. ఇక భోజనం ముగించాక అలా కొవెల్ వైపు మా ప్రయాణం సాగించాం దారిలో విదేశీయులు అరుణగిరి నీ వదిలి వెళ్లి వుండలేక అక్కడే కొన్ని మాల్స్ ఏర్పాటు చేసుకొని రోజు ఒకటి రెండు సార్లు గిరి ప్రదక్షిణ(గిరివలం) చేస్తారు. ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరం నుంచి తిరువన్నమలై క్షేత్రం గురించి తెలుసుకొని వచ్చి వారి జీవితంలో మార్పు సాధించారు.కానీ మనం ఇంకా అరుణాచలం గూర్చి తెలుసు కోలేక పోతున్నాం. ఈ మధ్య కాలంలో కొంత తెలుగు ప్రవచన కర్తలు అరుణాచలం గురించి చెప్పడం తిరుమల వెళ్లి స్వామి దర్శనం చూస్కొని కొంతమంది వెళుతున్నారు.కానీ పౌర్ణమి రోజుల్లో మాత్రం దేశ వ్యాప్తంగా అనేక మంది గిరివలం కోసం వస్తున్నారు. ఇక ప్రధాన ఘట్టం పంచభూత లింగాలలో తేజోవంతం గా వెలుగుతూ కృత యుగం నుంచి మొదలుకొని కలి యుగం వరకు అగ్ని,కాంచన రజత, శిల రూపాలుగా వెలుగొందుతూ నిత్యం అగ్ని లింగం గా యావత్ జగత్ కి తండ్రిగా కాపాడుతున్న అరుణాచలేశ్వరుని దర్శనం బయలు దేరాం….



ఆర్ముగిల్ అరుణాచల సన్నిధి…
ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ప్రకృతి ఆరాధనతో ముందుకు సాగుతుంటే ఆ ప్రకృతి తన లో నిబడికృతమైన సదాశివుడు పంచభూత లింగాలుగా కొలువై ఉన్నారు (ఆకాశ లింగం,చిదంబరం, పృధ్వీ లింగం, కంచి,వాయు లింగం శ్రీ కాలహస్తీ,జల లింగం తిరువానైక్కవల్, ఇక సమస్త పాపాలని పరిహరించే అగ్ని లింగం అరుణాచలం) ఇలా అరుణాచల క్షేత్ర వైభవం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ఎక్కడో నా ముందు ఒక సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన విదేశీయురాలు దర్శనం లైన్లో నిల్చోని అరుణాచల సంకీర్తన చేస్తూ ముందుకు సాగుతుంది ఆమె భక్తి పారవశ్యం చూసి నా మనస్సు మరోసారి అరుణాచల దేవాలయ గాలి గోపురం మీదకు వెళ్ళింది.. ఎంతో విశాలంగా ఆకాశమంత ఎత్తుకు సాగుతుందా అనే విధంగా భూమిని చీల్చడం కోసం ఏర్పాటుచేసిన గాలి గోపురం లా వుంది ఆ శిఖరం ఇక అనేక పావురాలు పక్షులకి ముక్తి మార్గం చూపడానికి తన సన్నిధిలో నివాసం వుంచుకున్నాడా అనే విధంగా అవి తమ రెక్కల సవ్వడులు చేస్తున్నాయ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే శరవణ భావునీ సన్నిధి కనపడింది. కుమారస్వామి తేజోవంతం గా స్తంభం చీల్చుకొని ఉద్భవించాడు. ఆయన దర్శనం సకల అబేధ్యమైన జీవనం సాగిస్తోంది అనడానికి చాలా నిదర్శనాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు బల్లల నంది కనిపిస్తుంది మరోపక్క 1000 స్తంభాల దేవాలయ మండపం కనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ నంది నీ పోలిన నంది వరంగల్ త్రికూట ఆలయం (వెయ్యి స్తంభాల గుడిలో మాదిరిగానే వుంది ఆ దేవాలయం కూడా 1000 స్తంభాలే) ఇక వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించిన మొదటి రుద్ర దేవుడు పరమ శివ భక్తుడు ఆతర్వాత క్రమంలో పాండ్యుల తో కాకతీయుల చెలిమి కారణంగా ఈ రెండు ఆలయాలు ఒకే రూపం తో నిర్మించారని చరిత్ర చెబుతుంది. అలా ముందుకు సాగుతున్న క్రమంలో మరో శివాలయం కనిపిస్తుంది భగవాన్ రమణ మహర్షి రోజు పూజ చేసినా శివ లింగం గుహాలయం లా మెట్లు దిగి కిందకి వెళ్లి దర్శించుకోవాలి. ఇక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ప్రధాన ఆలయం లోకి ప్రవేశం జరుగుతుంది ఇక్కడే మనకి ఓ చోట నిలబడితే అన్ని గాలి గోపురాలూ కనిపిస్తాయి. ప్రధాన శివాలయానికి పక్కనే వునట్టుగా అరుణ గిరి కనిపిస్తుంది పక్కనే కాలభైరవ స్వామీ ఆలయం కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా నే ప్రముఖ తమిళనాడు ఆర్కిటెక్చర్ రాష్ట్ర పతి అవార్డు గ్రహీత చే నిర్మితమైన నమూనా అరుణాచల సన్నిధి కనిపిస్తుంది అక్కడి నుంచి ఇక అసలు ప్రధాన ఘట్టమైన అంతరాలయం ప్రవేశానికి సాగుతున్నం అప్పటి వరకు చల్లగా వున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఓం నమశ్శివాయ …. అరుణాచల శివ అరుణాచల శివ అంటూ భక్తి పరవశంతో వేల కొలది భక్తులు ముందుకు సాగుతున్నారు ఈ ఘట్టం చూడగానే నాకు తిరుమల దర్శనం క్యూలైన్ గుర్తుకు వచ్చింది. గర్భాలయానికి సమీపంలో రాగానే పెద్ద పెద్ద నంది బృంగి ప్రమథ గణల రూపంలో 7ఫీట్ల ఎత్తుతో ద్వారపాలకులు అగుపించారు వారిని చూడగానే ఇంతపెద్ద శిల్పాలు ఎలా చేక్కరో ముఖ్యంగా కాలి గొర్లను కూడా శిల్పంలో చూపిన వారి శిల్ప కళా నైపుణ్యం అబ్బురపరిచింది.ఇక ప్రధాన సన్నిధిలోకి వెళ్ళగానే తేజో రూపం తో మన పాపాలని బస్మిపటలం చేసే రాశిభూతమైన నిర్వీకారుడు జగత్ తండ్రి అరుణాచలేశ్వరుడు దివ్య తేజో లింగ దర్శనం అయ్యేంది. ఇక్కడ ప్రధాన విషయం ఒకటి చెప్పాలి స్వామి ఇక్కడ అగ్ని లింగం….అందరు అంతరాలయంలోకి ప్రవేశించగానే వేడి సెగలు వస్తాయని చెప్పారు అది ఎంతవరకు నిజమో… కొంత అతి జోడించి చెబుతున్నారని అనుకునే వాని కానీ నాకు అంతరాలయం లోకి వెళ్ళగానే. అప్పటి వరకు కొంత చల్లగా వున్న శరీరం వేడెక్కిన ఫీలింగ్ కలిగింది చలికాలం నెగడు ముందు కూర్చుంటే తగిలే వేడి గాలులు నాకు అక్కడ గోచరించాయి.ఇక కొంత నిశ్శబ్దం నాకు ఆవరించింది. ముమ్మాటికీ శివుడు వున్నడనే నిజం అప్పుడు నాకు అరుణాచల దర్శనం తో కలిగింది. నిజంగా ఇది నా పూర్వ జన్మ సుకృతం…. ఏదో శివుని మీద హక్కు వుంటేనే అరుణాచలం ప్రవేశం కలుగుతుంది అందుకు నాకు దక్కిన హక్కు ఆ అరుణాచలేశ్వరుని దర్శనం తో ఏదో శక్తి నన్ను అవహించినట్టుగా భావిస్తున్న.





ఇక తరువాయి గిరి ప్రదక్షిణం…. నన్ను మార్చిన భగవాన్… స్కాంద ఆశ్రమం విరూపాక్ష గుహలు …