Thovva web news.in,17th February, Tuesday,.

మహబూబాబాద్, ఫిబ్రవరి.18మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. మురళిధర్ మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నర్సింగ్ హోమ్ లో వైద్యుడు డాక్టర్ ఇంద్రసేనారెడ్డి,వారు అంధించే సేవలకు సంబంధించి తీసుకునే రుసుముల పట్టికను అందరికీ తెలిసే విదముగా తెలుగులో రుసుముల వివరాలు తెలియపరచాలని జిల్లా వైద్యాధికారి అన్నారు. అదేవిధంగా ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు, యాజమాన్యాలు విధిగా దరల పట్టికను ప్రదర్శించాలని, సిబ్బంది కి సంభందిచిన ధ్రువీకరణ పత్రాలను విధిగా తనిఖీ అధికారులకు చూపించాలని, నర్సింగ్ హోమ్ లో పనిచేసే సిబ్బంది హాజరు పట్టికలో హోదాను రాయాలని మరియు వారి యొక్క క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ను ఆసుపత్రి సిబ్బంది వివరాలను మారినట్లయితే, జిల్లా కార్యాలయానికి క్వాలిఫైడ్ జిరాక్స్ కాపీలను పంపించాలని, ఆసుపత్రి రికార్డు ల నిర్వహణ తనిఖీ చేయడం జరిగింది. జనన ధ్రువీకరణ పత్రాలు పుట్టిన వెంటనే ఇవ్వాలని, హాస్పిటలకు వచ్చే రోగులకు మర్యాదగా మాట్లాడాలని,స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్ట్లు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ అని తెలుపుట చట్టరీత్యా నేరమని పేర్కొంటూ అన్ని స్కానింగ్ సెంటర్లలో ,స్కానింగ్ చేసే గదిలో మరియు ఫామ్ – F ఏ రోజువి ఆ రోజే ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ చేసిన అన్ని ఫారం-F లు అన్నీ ప్రతినెల 5వ తారీఖు లోపు జిల్లా వైద్యఆరోగ్య శాఖా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. ఈ తనికీలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ విజయ్ కుమార్, ఆరోగ్య విద్యా బోధకులు కె,వి. రాజు సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.—————-