


కేసముద్రం మండలంలోని పీక్లా తండ శివారు బోడ గుట్ట తండ ప్రాథమిక పాఠశాల భవన సముదాయం పెయింటింగ్ తో కళకళలాడుతోంది. ఆ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానో పాధ్యాయుడు డి.వి. రమణ తన సొంత నిధులు రూ. 25 వేలతో పాఠశాలకు రంగులు వేయించాడు. మూడు గదులు, ప్రహరి వంటగది, కిటికీలు, తలుపులు, జెండా గద్దె, మూత్రశాలలు అన్నింటికి వివిధ రంగులతో కూడిన పేయింటింగ్ వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాల గదులు రంగులు వెలసి పేలిపోయినట్లు ఉండడంతో తన సొంత ఇల్లులా భావించి రంగులు వేయించడం ఆయన పెద్దమనసును చాటుతుంది.
పాఠశాల సహ ఉపాధ్యాయుడు గనె యాదగిరి తనకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారని ఈ సందర్భంగా హెచ్.ఎం. రమణ తెలిపారు.