
Thovva Web news in,19 th February ,Wednesday, Umesh Sharma, kesamudram reporter
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జడ్పీ సీఈవో పురుషోత్తం అన్నారు. బుధవారం కేసముద్రం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, వివిధ గ్రామపంచాయతీలకు సంబంధించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో గ్రామపంచాయతీలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని , వేసవికాలం దృష్ట్యా కార్లు అబ్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి , మిషన్ భగీరథ ఏఈ అనూష, మండల పర్యవేక్షకులు సత్య ప్రకాష్, జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్, కృష్ణ మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.