ధన్నసరి మల్లన్న.. నీకు దండాలయ్య..

26న స్వామి వారి కళ్యాణం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొవ్వ, కేసముద్రం, ఫిబ్రవరి 26;

 *స్థల పురాణం*

వివరాల్లోకి వెళితే ఈ ప్రాంత ప్రజలకు ఇలవేల్పుగా నిలుస్తున్న మల్లన్న దేవుని గుట్ట స్థల పురాణమిది అనేక సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన నానబాల కట్టయ్య అనే యాదవుడు చెరువు కట్ట వద్దకు రాగా మల్లన్న గుట్టపై నుండి పెద్ద బండ రాళ్లు దొర్లిపడి దేవుని ప్రతిరూపం మెరుపులా కనిపించడంతో మర్చిపోయాడని ప్రతీతి ఆ తర్వాత ఆయన కలలోకి వచ్చిన దేవుడు తాను గుట్టపై ఉన్న సొరికే గుహలో ఉన్నానని తనకు గుడి కట్టించాలని కోరడముతో గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లి పరిశీలించగా సొరికెలో దేవుని మూలవిరాట్ కనిపించడంతో గ్రామస్తులు నమ్మకం కుదిరి అక్కడే గుడి కట్టించారు. ఈ గుట్టపై దేవాలయంలో మల్లికార్జున స్వామి ,శివలింగం, నందీశ్వరుడు, వినాయకుడు, ఎల్లమ్మ ,బద్ది పోచమ్మ, మైసమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దాదాపు  కొన్ని ఏండ్లుగా ప్రతి ఏటా ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దన్నసరి గుట్ట పరిసరాలు ప్రకృతి రమణీయంగా కలిగించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ధన్నసరి గుట్టపైనే లభిస్తుండడంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అంచలంచలుగా రెట్టింపు అవ్వడంతో ఈసారి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 *గుడిమెట్ల నిర్మాణం* 

గ్రామానికి చెందిన కొండ్రెడ్డి సరోజన వెంకట్ రెడ్డి దంపతుల ప్రధమ పుత్రుడు కీర్తిశేషులు శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ మాజీ సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ కొండ్రెడ్డి శ్రీవాణి -రవీందర్ రెడ్డి  రెండు లక్షల 50 వేల రూపాయలతో గుడిమెట్ల నిర్మాణం చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *