గిరిజన సామజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్
Thovva web news. In.09,march,sun

మహిళల రక్షణకై పోరాడాలని గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిషన్ నాయక్ పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్ అతిధిగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ మహిళల కోసం మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలు అవుతున్న గాని రాజ్యాంగం లో మహిళలకు ప్రత్యేక చట్టాలు, పథకాలు ఉన్న నేటికీ అవి అమలు కావడం లేదన్నారు. మహిళా ల మీద అత్యాచారాలు, అసమానతలు, దౌర్జన్యాలు, మహిళాలు అంటే వివక్షత ఇంకా నేటికీ కొనసాగుతుందని.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని విద్యా పరంగా అభివృద్ధి పదంలో కొనసాగాలని గొప్పగా ఎదగాలి అనిసందేశించారు. మహిళలు తమ హక్కుల కోసం దోపిడీ వివక్షత లేని, అసమానతలు లేని, సమాజం కోసం పోరాటం లో ముందుకు సాగాలని, మహిళలకు మగవారితో సమానంగా గౌరవం కోసం పోరాటం చేయాలని కిషన్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ప్రథం ఎడ్యుకేషన్ పౌండేషన్ సమనవ్య కర్త భూక్యా స్రవంతి, కుసుమ వసంత సారథ్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా లకు, బాలబాలికలకు పాటలు, నృత్య పోటీలు మరియు వివిధ సంస్కృత కార్యక్రమం నిర్వహించి పాల్గొన్న ర ఈ కార్యక్రమంలో , అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సులోచన ,బానోత్ పున్మమి, ప్రతుషా, భూక్యా జ్యోతి, భారతి, సావిత్రి, లకావత్ విజయ, బాల బాలికలు పాల్గొన్నారు.
