ఆదివాసి ప్రాంతాల్లో సర్వాధికారాలు ఆదివాసీలకే…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దండకారణ్య ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ సభ్యుడు సమిరెడ్డి మాణిక్యం

అల్లూరి జిల్లా చింతపల్లి తొవ్వ ప్రతినిధి. మార్చి 09:-
చింతపల్లి మండలం పెంటపాడు ఐ.టీ.ఐ. మైదానంలో రాష్ట్ర సలహాదారుడు డాక్టర్ చెండా కేశ్వరరావు అధ్యక్షతన ముందుగా అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మహిళ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది షెడ్యుల్డ్ ప్రాంతాల్లో సర్వాధికారాలు ఆదివాసీలకే ఉండాలని అన్నారు. శనివారం ఆర్ (డిఈవో) సమావేశం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు సమ్మిరెడ్డి మాణిక్యం మాట్లాడుతూ రాజ్యంగంలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఐదు. ఆరు షెడ్యుల్ పొందుపర్చడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశ గిరిజన ప్రాంతాలు ఐదో షెడ్యుల్డ్ పరిధిలోకి వస్తాయన్నారు. ఆదివాసీల కోసం రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులు. చట్టాలు షెడ్యుల్డ్ ప్రాంతాల్లో పాలకులు, అధికారులు సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ప్రధానంగా భూబదలాయింపు 1/70 చట్టం గిరిజన ప్రాంతంలో సమర్థవంతంగా అమలుకావడంలేదన్నారు. షెడ్యుల్డ్ ప్రాంతాల్లో భూములపై సర్వాధికారాలు, ఆదివాసీలకు మాత్రమే ఉంటాయని ఈచట్టం చెబుతుందన్నారు. సమతా తీర్పు ఆదివాసేతర సంస్థలకు సైతం గిరిజన ప్రాంత భూముల షెడ్యుల్డ్ ఆధారంగానే జీవో నంబరు-3 అమలులోకి వచ్చిందన్నారు. అయితే జీవోను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం బాధకరమన్నారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో నంబరు-3 పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీలకు షెడ్యుల్డ్ ప్రాంతాల్లో స్వపరిపాలన ఉండాలన్నారు. ఆదివాసీ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో దండకారణ్య ఉద్యోగుల సమితి పని చేస్తుంది.గిరిజన ప్రాంత ప్రజలను ఆదివాసీ గ్రామాలనుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతు న్నాయన్నారు. ఈచర్యలను అడ్డుకుంటామని, ప్రభుత్వాలకు ఆదివాసీలపై చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో ఆదివాసీ చట్టాలకు విఘాతం కలగకుండగా పరిశ్రమలు నిర్మించి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. రాష్ట్ర సలహాదారుడు మాట్లాడుతూ దండకారణ్య విమోచన సమితి (డీఎల్వో) జిల్లా. రాష్ట్ర స్థాయి కమిటీల రెండేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో రద్దు చేశామన్నారు. త్వరలో నూతన కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఈవో రాష్ట్ర అధ్యక్షుడు కోరా ఆనంద్. కార్యదర్శి సతీశ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కండకర్ల కాంతారావు. ప్రధాన కార్యదర్శి మార్కురాజు,గసాడి మల్లేశ్వరరావు, విద్యార్థి సంఘం రాష్ట్ర ఇన్చార్జి చల్లంగి కృష్ణ కార్యదర్శి మామిడి ప్రసాద్. రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలక పురు షోత్తం. డీఎల్వో నాయకులు కవడం కాసులమ్మ, వెంకయమ్మ, మాజీ ఎంపీపీ కవడం మచ్చమ్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *