కొత్తగూడ పాకాల మధ్య వేటగాండ్ల ఉచ్చులు
ఆటో లో కొండ గొర్రె,ఆటవీ పంది మాసం ను తరలిస్తు బస్సు ను గుద్దిన వెటగాండ్లు..
అటవీ శాఖ ఏం చేస్తుందో ప్రశ్నిస్తున్న ప్రజలు…
Thovva web link..Mahabubabad,16,March, sun:10 A.M
వేటగాళ్ల తూటాలకు మూగ జీవుల బలి అవుతున్నాయికరెంట్ బ్యాటరీ ఉచ్చుల్ పెట్టి ప్రాణాలు తీస్తు గుట్టుచప్పుడు కాకుండ పట్టణ ప్రాంతాల్లో మాంసం విక్రయిస్తున్నారు.

ఆ ప్రాంతంలో ఎత్తైన్న కొండలు, లోయలు లేకపోయినా చిట్టి పొట్టి చెట్లతో దట్టంగా కప్పబడింది. ఆ అడవిలో అనేక రకాల మూగ జీవులు సంచరిస్తుంటాయి. వాటిపై వేటగాళ్ల కన్నుపడింది. గుట్టుచప్పుడు కాకుండా మూగ జీవులను సంహరిస్తున్నారు. వారి బారీ నుంచి తప్పించు కోవడంలో మూగజీవుల రోదన అరణ్య రోధనగా మారింది. కొత్తగూడ మండలంలో రిజర్వు ఫారెస్టుగా పిలవబడే అటవీ ప్రాంతం . ఈ అడవిలో దుప్పెలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు వంటి జంతు జాతి మూగ జీవులతో పాటు, పక్షి జాతికి చెందిన అనేక రకాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా వేట సాగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాల్లో పేదలకు నగదు ఎరగా చూపి బయట వ్యక్తులు వారితో వేట సాగిస్తున్నారు. ఆదివారం జరిగిన సంఘటన తొ మరోసారి వెలిగులోనికి వచ్చింది
వివరాలు ఇలా వున్నాయ్
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంపాకాల చెక్ పోస్ట్ సమీపంలో నర్సంపేట నుండి కొత్తగూడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కొత్తగుడా వైపు నుండి నర్సంపేటకు వెళుతున్న ఆటో చిలుకమ నగర్ వద్ద ఆదివారం ఢీకొనడం జరిగింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలుకి గాయాలయ్యాయి, ఈ ప్రమాదంతోనే అడవి జంతువుల వేట వ్యవహారం బట్టబయలైంది.ఆ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కండక్టర్ కిందికి దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం, చనిపోయిన కొండ గొర్రెను గుర్తించారు.దీనితో ఆటోలోని నలుగురు వ్యక్తులు భయపడి కొండగొర్రెను అక్కడే పడవేసి ఆటో తో సహా పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్థానికులు మాత్రం ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లేక వారి నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు..
ఫోన్ కాల్ కి అందుబాటులో లేని ఫారెస్ట్ రేంజ్ అధికారి….
ఘటన జరిగిన తీరుపై తొవ్వ ప్రతినిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు పలుమార్లు ఫోన్ చేయక ఫోను లిఫ్ట్ చేయకపోవడం కోసమేరుపు..
