ఎన్నికలు సమీపిస్తున్న వేల కాంగ్రెస్ గాలి తగ్గుతుందా?
పోల్ మేనేజిమెంట్ చేసినవారే విజయధీరులు …
మహబూబాబాద్ ఎన్నికల పై “తొవ్వ”తాజా విశ్లేషణ …
ముఖేష్ వీరంటి 9398296146:
ఎన్నికల వాతావరణంలో రోజుకో తీరుగ మారుతుండటం సహజమే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల బలబలలు తెలిసిపోయేవి అభ్యర్థుల అర్ధ బలం మీదే ఆధార్ పడి ఉంటుంది నెల రోజులుగా సాగినపార్టీ ప్రచారం ఒకెత్తు అయితే ఈ నాలుగురోజులు జరిగే తుది అంకమే ప్రదానం పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎవరికి వారు తమ సత్తా చాటుతూ ఓటర్ల నాడి పసిగట్టి దానికి తగట్టుతుగా పోల్ మేనేజిమెంట్ చేయాలి మహబూబాబాద్ నియోజకవర్గాల్లో 9 మంది అభ్యర్థులు రంగంలో వున్నా ప్రధానంగా 3 పార్టీల నాయకుల మధ్య హోరా హోరీగా పోటీ వుంటున్నదని అనుకుంటున్నారు ప్రచారం చేస్తున్న బిఅరెస్ అభ్యర్థి శంకర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ , భాజపా అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఎవరికీ వారు తామే గెలుస్తామనే ధీమా తో సాగుతున్నారు . 30 వ తారీకు ఇంకా నాలుగురోజుల సమయం వున్నా ఈ తుది అంకంలో ఎవరి అర్ధ బలం ఎక్కువ చూపిస్తే వారే నెగ్గుతారనే పబ్లిక్ టాక్ వెళ్ళిపోయింది ఈ సందర్భంలో తొవ్వ న్యూస్ లైన్ కొంత సమాచారం సేకరించి కాంగ్రెస్ పార్టీ పై వున్నా ప్రచార సరళిని గుర్తించి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి వివరాలు వెల్లడిస్తుంది .
తగ్గుతున్న కాంగ్రెస్ గాలి …
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతి రోజు నుంచి గాలి బలంగా వ్యాపించింది అది కాపాడుకున్న నియోజకవర్గాల్లో వుంది కాపాడుకొని నియోజకవర్గాల్లో సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి కాంగ్రెస్ సీటు ను కైవసం చేసుకున్న అభ్యర్థులు ఎన్నికల తమ సామ దాన బేధ దండోపాయాలను ఉపయోగిన్చుకొని ఎలాగైనా బూత్ స్థాయిలో ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా వుంది కానీ మహబూబాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ సాబ్ కనుసన్నల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. వర్గ వైరుధ్యాలతో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి . బూత్ కమిటీ స్థాయిలో రోజువారీగా ధన సహాయం అందడం లేదని వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి దీనికి తోడు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అనుచరులను పట్టించుకోవడం లేదని వారు ప్రచారం చేద్దామనుకున్నపార్టీ కార్యక్రమాల్లో కలవనీయడం లేదనే విషయం వినిపిస్తుంది గూడూరు మండలంలోని నూనావత్ రమేష్ వ్యతిరేకంగా పావులు కదిపి రెబల్ గా మారడం తో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత రమేష్ కు అనుకూలంగా మారె అవకాశం లేకపోలేదు పార్టీ కోసం . పనిచేస్తామని వచ్చిన నాయకులూ సరైన ఆదరణ లభించకపోవడం తో నాయకులూ పాలకుర్తి లో ప్రచారం చేస్తున్నారు .2009 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్నికల అంత డబ్బుతోనే ముడి పడిపోయింది . డబ్బు మద్యం ఎక్కువగా ఎవరు పంచితే వారే విజయం సాధిస్తారని మునుగోడు , ఎన్నికలే ఉదాహరణ వారం రోజుల ముందుగానే ఓటర్లకు లిక్కర్ అందించి తాగి వూగేలా చేయడం ఎన్నికల నాటికీ ఓటర్లను ప్రలోభపెట్టెల ఆర్ధిక బహుమతులు అందించడం చేయాల్సిన బాధ్యత నాయకులదే లేని పక్షంలో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత వున్నా ఓటరుకు మీకు ఓటు వేయాలని వున్నా పక్క వాడు ఎక్కువ ఇస్తే వాని వైపుకే మొగ్గుచూపే అవకాశం మెండుగా వుంది దీన్ని గమనించకనే 2018 ఎన్నికలో ఆఖరి అంఖంలో డబ్బులను పోగొట్టుకొని గెలిచే సీటును కాంగ్రెస్ పోగొట్టుకున్నారు . నేడు అదే పరిస్థితి మల్లి కనబడుతుందని కాంగ్రెస్ సీనియర్లు వాపోతున్నారు పేరు చెప్పలేని ఒక కాంగ్రెస్ నాయకుడు ఏకంగా డబ్బులు తీయకపోతే ఎవరు ఓటేస్తారని బాహాటంగానే చెప్పడం గమనార్హం . కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మహబూబాబాద్ లో అతి ఉత్సహంగా మేము గెలిచిపోయాం మా ఎన్నికల ప్రచారం కాదని విజయోత్సవ ర్యాలీ లా ప్రచారం చేసుకుంటున్నామని అతి ఆత్మ విశ్వాసం తో సాగుతున్నారు . కానీ అన్ని సమయాల్లో అది పనికిరాదని ఎన్నికల నాటికీ పోల్ మేనేజ్ మెంట్ చేయకపోతే చతికిల పాడిల్సివస్తుంది . మహబూబాబాద్ పట్టణంలో ఓటర్ల లో కూడా గతంలో వున్నా కాంగ్రెస్ ఊపు తగ్గుతుంది దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం కొంత మేరకు అధికార ప్రతిపక్ష పార్టీల పై ప్రభావం చూపక మానదు అధికార పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకు ను బిజెపి చీల్చితే ఎవరు గెలుస్తారో తెలుస్తుధీ , కర్ణుడి చావుకు వంద కారణాలు చూపినట్టే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములు నిర్ణయించేది వారి నాయకత్వ పటిమ మానుకోట ఎన్నికలో ఎవరు గెలుస్తారో వేచి చూడక తప్పదు

