మోడీ మెప్పు పొందిన డోర్నకల్ బిజెపి ఫైర్ బ్రాండ్…*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేశ ప్రధానిని కలవాలన్న ఆయనతో మాట్లాడాలన్నా పక్కన కూర్చోవాలన్నా సీనియర్ నాయకులై రాజకీయపార్టీకి ఎంతో సేవ చేసి స్టేట్ లో కింది స్థాయి నుంచి పై స్థాయీ వరకు కొన్ని సంవత్సరాలు పార్టీకి అంకితం అయిన వారికే ఈ గౌరవం దక్కుతుంది అలాంటిది కొంత కాలం క్రితం పార్టీలో చేరి డోర్నకల్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచి రాజకీయ కురువృద్ధుడు రే డ్యా నాయక్. ను సమాంతరంగా ఢీకొంటూ ఎదురు నిలుస్తున్న డోర్నకల్ బిజెపి ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన భూక్య సంగీతకు సోమవారం జరిగిన ప్రధాని ప్రజాసంకల్ప సభలో అరుదైన గౌరవం దక్కింది ప్రధాని మోడీ కి గిరిజన సంప్రదాయం తో కూడిన కండువాను టోపీ నీ అందించి ఆయన ఆశీర్వాదం కోసం కిందికి వంగి నమస్కారం చేయగానే వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతిగా ఆమెకు శిరస్సు వంచి పాదాభివందనం చేయడానికి పూనుకోవడం సభలో ఒక్కసారిగా హర్షద్వనులు మిన్నంటాయి అనంతరం సంగీత ను పక్కన కూర్చోపెట్టకొని ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు దీంతో డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గ మహిళలు మోడీకి అభిమానులుగా మారిపోయారు. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానులను చూసిన ప్రజలు నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని మాతృమూర్తి లాంటి మహిళలను గౌరవించిన తీరును ఈరోజు దేశం మొత్తం గమనించారు. ఈదేశంలో మహిళలకు ఇవ్వబడిన గౌరవం తో దేశం మొత్తం ప్రణమిల్లంది ఇక సభలో ప్రజలను ఆయన పలకరించిన తీరును చూసి జన జనార్దన్లుగా అభివర్ణించిన ప్రసంగ పాటవంతో ఒక్కసారిగా సభ మొత్తం మోడీ మోడీ అంటూ ఒక రిథమ్ సాగింది. ఎది ఏమైనా మానుకోట లాంటి గిరిజన ప్రాంతానికి వచ్చి గిరిజన మహిళను గౌరవించడం బిజేపికి మహిళా ఓటు బ్యాంక్ ను పెంచాయి.





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *