ర్యాలీలుఊరేగింపులు డీజే లకుఅనుమతులు లేవు
డిఎస్పీ తీర్థాల సత్యనారాయణ ..
తొవ్వ న్యూస్ .ఇన్ .డిసెంబర్ 02
కెమెరామన్ :యాకుబ్ 8106685997.

ఎన్నికలకు సహకరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల కౌంటిగ్ ప్రక్రియజిల్లాలోని ట్రైబల్ వెల్ఫీర్ స్కూల్ లో జరగనున్న దృశ్య పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తిచేసినట్టు మాహబూబాబాద్ డిఎస్పీ తీర్థాల సత్యనారాయణ తెలిపారు . శనివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కౌంటిగ్ ప్రదేశం వద్ద జిల్లా ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ ఆదేశాల మేరకు 3 అంచెల బద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు . కౌంటింగ్ సెంటర్ కు వచ్చే ప్రతి కాండిడేట్ ఏజెంట్ తప్పకుండ పాస్ ధరించాలని వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం డిగ్రీ కళాశాల లో పార్క్ చేసుకోవాలని పార్కింగ్ వద్ద 144 సెకేషన్ అమలులో ఉంటుందని నలుగురు ఎక్కువమంది గుమ్మిగూడి ఉండకుండదాని , గెలుపు ఓటములు సహజం కావున ప్రజలు పార్టీల నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని ర్యాలీలలకు ఊరేగింపులు ప్రజా జీవనానికి ఆటంకం కలిగే ఏ అనుమతులు లేవు అని ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఈదులాపుసపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎస్ వి కళాశాల నుంచి రామచంద్రపురం మీదుగా పట్టణంలోకి రావాలని అదే రూట్ నుంచి వెళ్లాలని వివేకానంద నుంచి మొదలు ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రజలు బండ్లను పార్కింగ్ కానీ రోడ్లపై నిలబడటం కానీ చేయరాదని అత్యవసర సేవలైన అంబులెన్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు పై సూచనలు గమనించి ప్రజలు సహకరించాలన్నారు . ఈ కార్యక్రమంలో టౌన్ సి ఐ సతీష్ కుమార్ ఎస్సై లు సిబ్బంది పాల్గొన్నారు

గెలిచినా,వోడినా మీవాణ్ణి మీతోనే ఉంటా- బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్.
భాజపా గెలిస్తే మహబూబాబాద్ పేరును “మానుకోట : గా మార్పు
తొవ్వ న్యూస్ .ఇన్ .డిసెంబర్ 02
కెమెరామన్ :యాకుబ్ 8106685997.
గెలిచినా,వోడినా మీవాణ్ణి మీతోనేవుంటానని మహబూబాబాద్ బీజేపీ సెంబ్లీ అభ్యర్థి హుస్సేన్ నాయక్. అన్నారు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్ బీజేపీ నేతలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే మహబూబాబాద్ జిల్లా పేరు” మానుకోట”జిల్లాగా మారుస్తా…అని, సుమారు తొంబై రోజులుగా ప్రజలతోనే ఉన్నా,ప్రజా సమస్యలు తెలుసుకున్నా, యువకులు, మహిళల అభిమానం బీజేపీ పై,నరేంద్రమోడీ పై ఎంతగొప్పగా ఉందో తెలుసుకున్నా,నాపై ప్రజలు,అభిమానులు,బీజేపీ కార్యకర్తలు,నేతలు చూపిన అభిమానానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాఅన్నారు 1984లొ ఇందిరాగాంధీ ప్రధానిగా మానుకోటకు వచ్చిందని మళ్ళీ ఇంతకాలం తర్వాత తాను ప్రధాని నరేంద్రమోడీ ని ఇక్కడికి తీసుకువచ్చిన ఘనత తనకె దక్కుతుందని అన్నారు . మానుకోట ప్రజలు విజ్ఞత గల వాళ్ళు, ప్రజలిచ్ఛే తీర్పుకు కట్టుబడి ఉన్నా,గెలిచినా వోడినా ప్రజల మధ్యనే ఉంటా,ప్రజా సమస్యలపై అనుక్షణం సమాధానం వెతుకుతూనే ఉంటా అంటూ ఉద్విఘ్న0గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఒద్దిరాజు రాంచందర్ రావు , వెంకన్న ,ఆకుల శ్రీనివాస్ , అశోక్ శ్యామసుందర్ శర్మ ,బాలు చీకటి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు అవినీతి అక్రమాలే ….
సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
తొవ్వ న్యూస్ .ఇన్ .డిసెంబర్ 02
కెమెరామన్ :యాకుబ్ 8106685997.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ, అవినీతి అక్రమాలు జరిగాయి. అధికార పార్టీ, ప్రత్యక్ష పార్టీలు పోటీపడి ప్రజలను ప్రలోభ పెట్టడానికి శతవిధాల ప్రయత్నించాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండే బూతుల వారీగా ప్రచారానికి తమ కార్యకర్తలకు ద్వారా వేల రూపాయలను విచ్చలవిడిగా పంపిణీ చేశారు.సభలకు సమావేశాలకు విందులు, వినోదాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడమే కాకుండా అధికార దుర్వినియాగం సైతం పాల్పడ్డారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామని, నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్పిన ఎన్నికల కమిషన్ ప్రధాన పార్టీల డబ్బు పంపిణీని, అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమైంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. సామాన్యుడికి అందుబాటులో లేని ఖరీదైన వ్యాపకంగా మారిన ఎన్నికల్లో న్యూడెమోక్రసీ రెండు సంస్థలు ఐక్యంగా పోటీ చేశాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భట్టు భిన్నమ్మను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి పార్టీ శ్రేణులు కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. సాదాసీదాగా నిర్వహించిన మా ప్రచారానికి ప్రజల ఆదరణ లభించింది. అధికార ప్రత్యక్ష పార్టీల డబ్బు పంపిణీని ప్రలోభాలను తిరస్కరించి మా ప్రచారంలో పాల్గొన్నారు.డబ్బును, ప్రలోభాలను తిరస్కరించి స్వచ్ఛందంగా ప్రజలు మా పార్టీకి ఓట్లు వేశారు. స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి భట్టు భిన్నమ్మకు ఓట్లు వేసిన ప్రజలకు జేజేలు తెలియజేస్తున్నాం. ఎన్నికలలో ఎవరు గెలిచినా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావు. రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలు కార్పొరేట్ సభ్యులకు సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తాయి తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించలేవు. బలమైన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజలు తమ హక్కులను నిలబెట్టుకోగలుగుతారు, సమస్యలను Questionnaire గలుగుతారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాం.అన్నారు ఈ కార్యక్రమంలో భట్టు బిన్నమ్మ అభ్యర్థి గౌని ఐలయ్య ఎన్నికల కన్వీనర్మండల వెంకన్న,న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులుబండారి ఐలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి హలావత్ లింగ్యా ,కో కన్వీనర్ దేవేందర్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులుశివ్వారపు శ్రీధర్,ఇఫ్టు జిల్లా కార్యదర్శి
భట్టు చైతన్య, ఎన్నికల ఏజంటుయస్కే బాబు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు
