తేల్చి చెప్పిన పార్లమెంట్ …
ఈశాన్య రాష్ట్రాలకు తప్ప అన్ని రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్ లు
తొవ్వ న్యూస్,ఇన్//9398236146…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కుమార్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్లు లేవని, మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారువీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందన్న మంత్రి కౌశల్ కుమార్ అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉందని, దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం ఆమోదించిందన్నారు



.దేశ రాజధాని దిల్లీలో నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్బాల్లో భాగంగా రాజ్యసభలో 28 రాష్ట్రాల రాజధానులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంశంపై లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ది సహాయ మంత్రి కౌశల్ కుమార్ ఏపీ రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. రాజధానుల అంశంపై ఆయన రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని స్పష్టంగా వివరించారు.ఏపీకి రాజధాని అమరావతే. 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పటికే రాజధానుల పేర్లతో కేంద్రం ఆ వివరాలను వెల్లడించింది. అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన వాటిలో అమరావతి కూడా ఉంది. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం. ఏపీ రాజధాని అమరావతి సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్లను ఆమోదించాం” అని రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో మంత్రి తెలిపారు దీనితో గతంలో ఏపీ రాజధాని అమరావతి నా విశాఖ పట్నం అనే సందిగ్థత తొలిగిపోయింది , ఇకపోతే ముఖ్యంమత్రి జగన్ ఏపీ రాజధాని విషయంలో చేస్తున్న తాత్సారం తో అమరావతి రైతులు గతంలో ఆందోళనలు నిరసనలు పాదయాత్రలు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడమా తో రైతులు మరణం తప్ప గత్యంతరం లేదని ఆవేదనలో వున్నారు పార్లమెంట్ లోని రాజ్య సభలో అమరావతి మాస్టర్ ప్లాన్ పై స్పష్టత రావడం తో అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు .