“అన్న” అంటూనే వెన్నుపోటు..
గెలుస్తాం అంటూనే తప్పుడు సంకేతాలు …. భజన
కబ్జాల లీకులు ఇచ్చి కాంగ్రెస్ కు ధైర్యం నింపిన “షాడో” లు
శంకర్ నాయక్ ఓటమి పై తొవ్వ విశ్లేషణ
తోవ్వ న్యూస్ .ఇన్ 9398236146

శంకర్ నాయక్ ఆహార్యంమే గాంభీర్యత తో ఉంటుంది కానీ వక్తిత్వం లో చాల “బోలా”మనిషి అందుకే అయనను గమనించిన వారు” బోలా శంకరుడు” అంటారు అటువంటి అయన దగ్గర భజన బృందం చేరి ఎపట్టికప్పుడు నువ్వు వీరుడవు శురుడవు ,అంటూ భజన చేస్తూ మెప్పు పొందుతూ ఆయన పేరు చెప్పి బయట పంచాయతీలు కబ్జాలు చేసి అయన ఓటమికి ప్రధాన కారకులు అయ్యారు . ముఖ్యంగా “అన్న” అంటూనే వెన్నుపోటు..పొడిచిన నేతలు నిత్యం అయన తోనే వుంటూ క్యాంపు కార్యాలయంలో జరిగే విషయాలను లీకులు ఇస్తూ చేసిన అభివృద్ధి కంటే నిందలు పడే పనులను చేపిస్తూ ప్రజల్లో శంకర్ నాయక్ పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబరచడంతో సఫలీకృతం చేశారు ఈ భజన బృందం . . ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో అయన అనుచర ఘనం అయన పేరు చెప్పుకుంటూ పలు భూ దందాలు, సెటిల్మెంటు ఇతర ఇల్లీగల్ వ్యాపారాలు ఇసుక, భూకబ్జాలు, సెటిల్మెంట్లు అధికారుల వద్ద వసూళ్లు చేస్తూ బారీ ఆక్రమణలకు తెరలేపారంటూ ప్రచారం జరిగింది దీనికి తగ్గట్టుగానే . ఒక మండల స్థాయి నాయకుడు ఏకంగా అధికారులను బెదిరించి తన వాహనలకు కిస్తీలు కట్టించుకుని ఉద్యోగుల పట్లు ఎమ్మెల్యే కు వ్యతిరేకం చేశారు .అందుకే పోస్టల్ బ్యాలెట్ లో చాల వ్యతిరేకంగా ఓట్లు నమోదు అయ్యాయి . పట్టణంలో పలు వార్డులో తల దూర్చాలనే ఆలోచన లేకున్నాశంకర్ నాయక్ కు అయన కు చెవిలో జోరీగలా లేనిపోనివి చెపుతూ ఎక్కడ తప్పు ఒప్పలు చేస్తున్నారో తెలియకుండా ఆహా.. ఓహో.. అంటూ నిత్యం భజన చేస్తు మున్సిపల్ వ్యవహారాల్లో తలదూర్చేలా చేసి పట్టణ ఓటర్లను వ్యతిరేకులను చేశారు . పత్తిపాక రోడ్ విస్తరణ పనులు ఆపాలని ఎన్నికల తర్వాత చేసుకుందని చెప్పిన సీనియర్ల మాటలు వినపడకుండా చేసి ఎన్నికల నాటికే రోడ్డు పనులు పూర్తయి ఎక్కువ ఓట్లు వస్తాయని నమ్మబలికించి రోడ్ల విస్తారణ పనులు చేపట్టి ఎంతో మంది పేదల వ్యాపారుల కు కంటగింపుగా చేసి పట్టణ ఓట్లకు ఎసరు బెట్టారు . అంతే కాకూండా కొంతమంది వార్డు కౌన్సిలర్లు వారి అనుచరులు ఆయన పేరును ఉపయోగిస్తూ జిల్లా కేంద్రంలో విలువ కలిగిన భూములను ఆక్రమిస్తూ బెదిరింపులకు పాల్పడటం ఇది అయన వరకు రాకుండా భజన బ్యాచ్ మేనేజ్ చేయడం క్యాంపు కార్యాలయంలో వుంటూ భూ వ్యవహారాలు నడుపుతూ షాడో లుగా ప్రవర్స్తిస్తు క్యాంపు కార్యాలయంలో జరిగే విషయాలను లీకులు ఇస్తూ ప్రజలకువ్యతిరేకం చేసారు . ప్రభుత్వ పథకాలనునిజమైన పేదలకు అందకుండా తమ వర్గం వారికే వచ్చేలా లాబీయింగ్ చేస్తుగ్రామాల నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలను నాయకులను అడ్డుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు తమ పార్టీలోనే అస్సమతి నేతల వర్గాలకు పదవులు దక్కకుండా వారి మధ్య వైరం ఉంటేనే తమ పబ్బం గడుస్తుందని నమ్మి వారికీ పదవులు అందకుండా చేశారు ఈ “భజన బృందమే ” . ఎన్నికల వేళా ఎక్కడ లోటు పట్లు వున్నాయే తెలియజేయడానికి వచ్చిన జర్నలిస్టులు ఇతర ఉద్యమ నాయకులను శంకర్ నాయక్ కలవనీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకున్నారు ,ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పైన ప్రజలకు ఎటువంటి వ్యతిరేకం లేనప్పటికీ కేవలం 6 నెలల వ్యవధిలో మహబూబాబ్డ్ కేసముద్రం గూడూరు నేతలు వ్యతిరేకంగా మారి ప్రజల్లో పార్టీపై నిరాశ వ్యతిరేకం కనబరిచారు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తనకు సంబంధం లేని వార్డు కౌన్సిలర్ రవి హత్యకు కారకులైన వారికీ కావాలని ప్రచార రథం ఎక్కించి గిరిజన ఓట్లకు గండి కొట్టించారు ఈ నేతలే . ఎన్నికల వెల ఓటర్లకు పంచమని పంపిన డబ్బులు ఓటర్లకు అందకుండా చేసి తాముజేబులో వేసుకొని ఓట్ల కు ఎసరు పెట్టారు . . కొంతమంది నాయకులు అయన పేరు చెప్పుకొని పదవులు అనుభవించి అన్న అంటూనే వెన్నుపోటు పొడిచారు . ఒకపక్క కౌంటింగ్ పక్రియ అయిపోక మునుపే నీ వెంటే మేము అన్న అంటూ గెలిచినా నేతకు నీరాజనాలు పలికి సంబరాల్లో మునిగినట్టు సమాచారం ఇలా శంకరుని ఓటమికి అందరూ కింకరుల వలే పనిచేసారు ఇప్పటికైనా ఎవరు అయన వెంట వున్నవారు ఎవరు పరాయి వారో గ్రహించి ముందుకు సాగితేనే రాజకీయ భవితవ్యం .