ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజకీయాలు ఉండాలి
కడియం , రాజాసింగ్ తీరులపై మండిపడ్డ సీనియర్ జర్నలిస్ట్ “దేవులపల్లి “
సేకరణ : తొవ్వ న్యూస్ .ఇన్ 9398236146
తెలంగాణ రాజకీయాలు ప్రజలే నిర్ణయించి మార్పు కావాలని కోరుకొని మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ఈ తరుణంలో కొంతమంది రాజకీయ ప్రభుద్దులు తమ ఇష్టాను సారంగా వ్యవహరిస్తూ ఇంకా కొలువు దీరని కొత్త ప్రభుత్వం పై శాసన సభ్యులను కించాపరిచేలా ఎమ్మెల్యే లను కొనుగోలుచేయాలనే సంకేతాలు పంపిస్తూ అనారోగ్య కరమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఐజేయూ వ్యవస్థాపక సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు వారు సోషల్ మీడియా వేదిక గా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులు అంటున్న మాటలకూ స్పందించి తదనుగుణంగా మాట్లాడుతూ కడియం శ్రీహరి మాటలను ఉటంకిస్తూ ఎవరిని చీరి చింతాకు కట్టాలి తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆరెస్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళినప్పుడు ఈ మాట నాటి ముఖ్యమంత్రి నేటి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు పలు వేదికలు బహిరంగ సభల్లో అన్నారు . కానీ 2014 లో 2018 లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో గెలిచినా సభ్యులను నిసిగ్గుగా తన పార్టీలోకి చేర్పించుకొని 2023 లో ప్రజల తీర్పుతో “చీరి చింతాకు కట్టేసేలా చేసుకున్నాడు ఇంకా కనీసం ప్రతిపక్షం లోకి వెళ్ళాక ముందే తన ఎమ్మెల్యే లతో కాంగ్రెస్ శాసన సభ్యులను కొనుగోలుచేసి అధికారంలోకి వెళతామని సంకేతాలు ఇస్తున్నారు దీనికి తోడు మరో బీజేపీ శాసన సభ్యుడు రాజాసింగ ఏకంగా సంవత్సరం కూడా కాంగ్రెస్ పాలించాదని వచ్చే ఏడూ భాజపా ప్రభుత్వంలోకి వస్తుందని మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ఉదాహరణ చెప్పడం విడ్డురంగా మారింది ఇదంతా చూస్తుంటే దేశంలో ఆరోగ్యకరమైన రీతిలో ఎన్నికలు లేవని ధన అధికార బలం కోసం ఎంతకైనా తెగిచవచ్చు ఏదైనా చేయవచ్చనే ధోరణిలో పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుందా ! ఇలాంటి వారి ని చూసి ప్రజలు కూడా చీరి చింతాకు కట్లడానికి ఉపయుక్తం అవుతున్నారు
