ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన “రేవంత్ రెడ్డి “
“రాజీవ్ గాంధీ ” కుటుంబ సభ్యులతో పాటు ఏఐసీసీ పెద్దలు హాజరు
సోనియా ఆశీర్వాదం తీసుకున్న” “రేవంత్ దంపతులు”
తొవ్వ న్యూస్ .ఇన్ //9398236146


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం కొలువు తీరింది రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథుల కాంగ్రెస్ పెద్దలు రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం ఆరు గ్యారెంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేసి ఆ దస్త్రాన్ని వేదికపైనే ఆమెకు అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి జేజేలు పలికి ‘పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రంలో తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సంక్షేమామే ఎజెండాగా ముందుకు సాగుతూ సమన్యాయం పాటిస్తామన్నారు తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారని ఇప్పటికే ప్రగతిభవన్ ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్కు రావచాన్నారు ప్రతి వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు . . రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతమన్నారు . జ్యోతిరావుపూలే ప్రజా భవన్లో ప్రజా దర్బార్ ఉంటుంది. మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేం పాలకులం కాదు, మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం’ అని నూతన ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.



నూతన క్యాబినెట్ సమావేశం ….
6 గ్యారెంటీలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్
గ్రూప్ 01 02 పరీక్షలు , టీఎస్పీఎస్సి పై శుక్రవారం భేటీ
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ లో పలు అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎన్నికల వేళా హామీ గా ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు . ప్రజా సమస్యలపై చర్చించారు. భేటీలో సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య తెలంగాణ ఎజెండాగా కాంగ్రెస్ పాలనలో ఆవిష్కరిస్తామని భేటీ అనంతరం కొత్త మంత్రులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆర్ధిక బిసి సంక్షేమ శాఖ మంత్రులు , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ అన్నారు . క్యాబినెట్ మీటింగ్అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నియంతృత్వ పాలనకు ప్రజలు పాతరేశారని తెలిపారు. తొలి కేబినెట్ సమావేశంలో ఇచ్చిన హామీలు సహా ఆరు గ్యారంటీలపై చర్చించినట్లు వెల్లడించారు. చర్చ అంతకు ముందు సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డిసచివాలయ ఉద్యోగులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులూ సచివాలయానికి చేరుకున్నారు