పాలకవర్గాన్ని దించేయాలని గట్టి ప్రయత్నాలు…
చైర్మన్ వైస్ చైర్మన్ ల పై గుర్రుగా గులాబీ వార్డు సభ్యులు….
తొవ్వన్యూస్.ఇన్.//9398236146
మానుకోట మున్సిపల్ పాలక వర్గం అవిశ్వాసానికి రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇన్నిరోజులు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పాలించిన మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైరన్ ల తీరుతో విసిగి వేసారిన స్వంత పార్టీ సభ్యులు (గులాబీ ) ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్ల సహకారం తో అవిశ్వాసం పెట్టి దించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది దీనికి కారణం . నాటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి కి ప్రకటించిన 50 కోట్ల రూపాయల నిధుల వ్యవహారం గా కనిపిస్తుంది ఆ నిధులలో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అటు గులాభి వార్డ్ కౌన్సిలర్ల తో పాటు ప్రతిపక్ష వార్డ్ సభ్యులు కూడా ఈ వ్యవహారంపై జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ ల తీరుపై ధర్నాలకు దిగడం స్వయం ప్రతిపత్తి కలిగిన మున్సిపల్ పై ఎమ్మెల్యే పెత్తనం ఏంటని ప్రశ్నించడం తో ఆరోజుల్లో జిల్లాలో అన్ని పార్టీలో మున్సిపల్. చర్చ అంశం గా మారింది ఆనాటి ఎమ్మెల్యే కు అండగా వుంటూ చైర్మన్ ,వైస్ చైర్మన్ వార్డ్ కౌన్సిలర్ల అభిప్రాయాలను పట్టించుకోలేదని . గులాబీ పార్టీ వార్డు కౌన్సిలర్లు గళమెత్తి ప్రశ్నించిన వారి మాటలకూ విలువ లేకుండా చేయడం మూలానే ప్రస్తుత పరిస్థితికి కారణంగా గుసగుసలు వినిపిస్తున్నాయి ,దీనికితోడు మున్సిపలి టీ పరిధిలో ఇంటి నెంబర్లును ఇవ్వాలని పలు సందర్భంలో తీర్మానాలు చేసి కలెక్టరేట్ కు పంపిన అతి గతి లేకపోవడం వార్డ్ సభ్యులకు తెలియకుండా అధికారుల ప్రమేయం తో ఇంటి నెంబర్ల ఇస్తున్నట్టు తెలుస్తుంది వార్డుల లో వచ్చే నిధులు సక్రమముగా అమలు కావడం లేదని.ప్రతి పక్ష వార్డ్ సభ్యులను పాలక మండలి అధికారులు గౌరవించడం లేదనీ ఇలా చెప్తూ పోతే చాలా నే వుంటుందని అందుకే రాష్ట్రంలో అధికారం మార్పు చెందటంతో అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ పై అవిశ్వాసం పెట్టి దించి తామ జెండా ఎగురవేయలని లేని యేడల తమ మిత్రపక్షం అయిన సిపిఐ కి చైర్మన్ ఇచ్చి తాము వైస్ చైర్మన్ తీసుకోవాలని ప్రయతిస్టునట్టు సమాచారం ఏదిఏమైనా అధికారం వున్నపుడు విర్రవీగిన కొంతమంది నాయకులకు ఇది గొడ్డలిపెట్టు లా వందని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు ,
నాటి ధర్నా ఫోటో


