హైదరాబాద్లో సీఎం జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు
కలెక్టరేట్ల లోనూ ‘ప్రజావాణి’ యథాతథం
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటీవల ప్రజా పరిపాలన భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో, అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ ప్రజా భవన్లో సీఎం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరు గుతుండగా, జిల్లాల్లో మంత్రులు అయా నియోజకవర్గ ఎమ్మెల్యే ల సమక్షంలో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ప్రజాభ వన్ లో ఏర్పాటు చేసినట్లే, జిల్లాల్లోనూ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజూ గంట సేపు దర్బార్ నిర్వహించాలని ఇందుకు సంబంధిం చిన ఏర్పాట్లు, మార్గదర్శకాలు రెడీ చేయాలని సీఎం సైతం ఆదేశించినట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకూ సమాచారం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు ప్రజా దర్బార్పై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరుగుతున్న ప్రజావాణి లో అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు ఇక ప్రజా దర్భర్లో జిల్లా ముఖ్య మైన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ రెండు దఫాలుగా పవర్లో ఉన్న ప్పటికీ.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకు నేందుకు వీలుగా అవకాశం లభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంను అసలు కలిచే ఛాన్స్ లేకపోగా, జిల్లాల్లో నూ మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు చాలానే వచ్చాయ్ .కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం ప్రజావాణి పేరిట ఏర్పాటు చేసిన ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని ఆపావదు లేకపోలేదు. దీంతో బాధితులు తమ అప్లికే షన్లు పట్టుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు,హైదరాబాద్ లోని సంబంధిత శాఖల అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగా ల్సి వచ్చేది. అంతా ఆన్లైన్లోనూ పరిష్క రిస్తామని పలు డిపార్ట్మెంట్లు పేర్కొన్నప్ప టికీ, క్షేత్రస్థాయిలో అమలు చేయడం సాధ్యపడలేదని అధికారులు పేర్కొంటు న్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్లో ఇలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రజాదర్బార్ నిర్వహించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నది.


క్షేత్ర స్థాయిలో పరిష్కారం*
గ్రౌండ్ లేవల్ లోనే అధికారులే వ్యవస్థను సక్రమంగా నడిపిస్తే సీఎంను కలిసే అవసరం లేదని గతంలో మాజీ మంత్రి కేటీఆర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ పేదల సమస్యలకు పరిష్కారం చూపేందుకు క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు చొరవ చూపడం లేదనేది వాస్తవం. దీంతోనే ప్రజలు గడిచిన 8 ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా ధరణి, స్కాలర్ షిప్స్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం, ఆరోగ్యశ్రీలో అడ్మిషన్లు ఇవ్వకపోవడం, స్కీమ్స్ అందక పోవడం వంటి తదితర స్కీముల్లో మెజార్టీ పేద ప్రజలు సమస్యలు చ చూశారు. తమ బాధలను వినే నాథుడే లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడి మార్పు కావాలని కోరుకున్నారు.
