మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ సీఎం గా ప్రమాణం చేస్తేనే అంటున్న అభిమానం
మరో ఐదు ఎండ్లు చెప్పులు వేయని మాజీ మంత్రి…
తోవ్వన్యూస్.ఇన్//
9398236146..
కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకూ చెప్పులు వేయనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ భీష్మించుకుని వున్నారు. ముఖ్యమంత్రి ముచ్చటగా మూడవసారి ప్రమాణం చేయాలని దీక్ష గా.గతేడాది సెప్టెంబర్ 17 నుంచి ఒట్టి కాళ్లతోనే నడకను కొనసాగిస్తు
న్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అలాగే విస్తృతంగా పర్యటించారు. మే నెల ఎండలో సైతం తారు రోడ్డు పై నడుస్తుంటే కాళ్ళు బోగ్గలు ఎక్కిన పట్టించుకోలేదు. ఇది ఇలా వుండగా ముఖ్యమంత్రి కెసిఆర్ పై వున్న సోదర బాంధవ్యం తో పచ్చ బొట్టు వేసుకొని గతంలో తన అభిమానం చాటుకున్నరు .అయిపోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఆమె ఆకాంక్ష నెరవేరలేదు. దీనితో మళ్లీ అధికారం కోసం రాబోయే ఐదేళ్లు దీక్ష కొనసాగిస్తూనే వున్నారు. సీఎంగా కేసిఆర్ గా ప్రమాణస్వీకరం చేసిన రోజునే శపథం నెరవేరుతుందనితన పంతం చెల్లిస్తున్నారు మాజీ మంత్రి.రాథోడ్..



