మాజీ మంత్రులు సత్యవతి , ఎర్రబెల్లి లతోనే పార్టీ ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమి...
మాజీ ఎమ్మెల్యే లకు సెక్యూరిటీ ఎందుకని …వారి వెంట కుక్కలు కూడా పడవు
ఉద్యమ పార్టీని చీడల పట్టి నాశనం చేసారంటూ ఎమ్మెల్సీ రవీందర్ రావు .హాట్ కామెంట్ ..
తొవ్వ న్యూస్.ఇన్ //9398236146

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ గులాబీ పార్టీ ఉద్యమ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీస్తున్నాయి , గులాబీ పార్టీలో ఉద్యమ నేతగా ఉంటూ గ్రామ స్థాయిలో ఉద్యమానికి కాగడగా నిలిచి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసి కేసీఆర్ అనుంగ అనుచరుల్లో ఒకరైన తక్కెళ్లపల్లి కామెంట్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీస్తున్నాయి . రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓటమికి నాయకులూ అత్యుత్సాహం కారణమని గతంలో అయన చేసిన వ్యాఖ్యలుకు నాడు గులాబీ పార్టీ లో చర్చనీయాంశమైన విషయం విదితమే, శుక్రవారం అయన అసెంబ్లీ వేదికగా చిట్ చాట్ గులాబీ నేతల్లో గుబులు పుట్టేలా విమర్శించారు . రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని సీనియర్లు చెప్పిన పట్టించుకోలేదని , అదేవిధంగా ఉద్యమానికి సంబంధం లేని నేతలను పార్టీలోకి చేర్చుకోవడం తోనే అసలు ముప్పు దాపురించిందని , ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిన ఎమ్మెల్యే లు వారి వైజితీగతంగా చేసిన తప్పులే కారణమని పరోక్షంగా భూ దందాలు ఇతర ఇల్లీగల్ చేసేవారిని అనుచరులుగా పక్కన ఉంచుకోవడం మూలానే ఈ పరిస్థితి వచ్చిందని . రాష్ట్ర మంత్రులుగా ఎర్రబెల్లి , మరో మంత్రి సత్యవతి రాథోడ్ ఉద్యమం లో లేరని ఉద్యమ నాయకులను వారి ఏనాడూ పట్టించుకోలేదని వారి మూలాన పార్టీ అప్రతిష్టాత పాలైందని , ఓడిన ఎమ్మెల్యే లకు సెక్యూరిటీ అవసరం లేదని వారిని చూసి కుక్కలు కూడా వెంటపడవని విమర్శించారు దీని తో ఉమ్మడి జిల్లాలోనే కాక మహబూబాబాద్ నియోకవర్గ వ్యాప్తంగా తక్కెళ్లపల్లి స్పందించిన తీరు తో ఉద్యమ నాయకులు ఉత్సహం నింపినట్టుగా కనిపిస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో ఎదో జరుగుతుందనే సందేహం రాక మానదు కాంగ్రెస్ పార్టీ కి బూస్ట్ కోసమా ఉద్యమ ద్రోహులకు కనువిప్పు కలిగేలా ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేక్షకులు

