విద్యార్థుల సంఖ్య బలం పెంచి చూపి వార్డెన్లు దోపిడీ…
పర్యవేక్షించాల్సిన అధికారులకు పర్సంటేజీల ఏరా….!
విద్యార్థుల ఆహారంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించని వార్డెన్లు
నూతన ప్రజా ప్రతినిధులు హాస్టల్ ను సందర్శించండి
తొవ్వ న్యూస్ . మహబూబాబాద్ / 9398236146

రాష్ట్ర ప్రభుత్వం పేద గిరిజన విద్యార్థులకురాజ్యాంగం కల్పించిన హక్కైనా చదువును అందరికీ అందించాలని కృతనిచ్చేయంతో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ హాస్టలను అధికంగా ఏర్పాటు చేసిగిరిజన గ్రామాలకు తండాల చెంతకు తెచ్చి పేద గిరిజన విద్యార్థులకు విద్యను అందిస్తున్నప్పటికీ కొంతమంది అవినీతి అధికారులు వార్డెన్ల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పర్సంటేజ్ లో అలవాటు పడి ప్రభుత్వ విద్యా విధానానికి గిరిజన సంక్షేమ హాస్టల్లో పనితీరుకు తూట్లు పొడుస్తున్నరు. వీరికి వత్తాసుగా గత అధికార పార్టీ నేతలు అండగా ఉండటం తో విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరమైంది . నేడు నూతన ప్రభుత్వంలో తమ బతుకులు మారి సరైన సదుపాయాలు అందుతాయని కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హాస్టళ్ల ను సందర్శించి తమ బాగోగులు చూస్తారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆశిస్తున్నారు .

విద్యార్థుల ఆహారంలోని అజాగ్రత్త
జిల్లాలోని ఆశ్రమ హాస్టళ్లలో ఆహార విషయంలో మరి దిగజారుడుగా వ్యవహరిస్తు వార్డెన్లు ఇష్టారీతిని దోచుకుంటున్నారు వీరికి మద్దతుగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ లోను అధికారులు మద్దతు వుంటున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో హాస్టల్ లో ఫుడ్ ఫాయిజనింగ్ కేసులు అధిక మొత్తంలో నమోద ఐనప్పటికీ తు తు మంత్రముగా వారిపై చర్యలు తీసుకున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి . ప్రస్తుతం ఈ పరిస్థితి మార్పు రావాలని గతంలో జిల్లాలోని పెద్ద గూడూరు,మండలంలో ఆశ్రమ పాఠశాలలో జిల్లా కేంద్రంలోను ఏజెన్సీ మండలం లోను ఆహారంలో బోదింకలు వానపాములు కనిపించడటం విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, జరిగింది అదే తీరున ప్రస్తుతం హాస్టళ్ల పర్యవేక్షణ జరుగుతుందని ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాతే పర్యవేక్షిస్తారా..? పర్శంటేజిల మీద వున్నా శ్రద్ధ విద్యార్థుల ఆహార నియమావళి మీద లేదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో బహిరంగంగా ఆరోపిస్తున్నారు. .

అధికంగా హాజరు సంఖ్య
జిల్లాలో హాస్టళ్లు సామర్ధ్యానికి మించి విద్యార్థుల హాజరు శాతం చూపిస్తూ హాస్టళ్ల వార్డెన్లు దందా చేస్తున్నారని విద్యార్థులు సంఖ్య వాస్తవ రూపంలో తక్కువగా విద్యార్థుల సంఖ్యను 4 రేట్లు ఎక్కువగా చూపిస్తు వారి పేరుపై వచ్చే కోట్ల రూపాయల నిధులు ని (సరుకులు ఇతర వస్తువులు బట్టలు, రోజువారీ వస్తువుల ఖర్చులు )నుపర్సెంటేజీలుగా అమ్ముకుంటున్నారు . 2016–నుంచి 2023 వరకు ప్రతి హాస్టళ్లు రికార్డు ను అడిట్ చేపించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అవినీతి అధికారుల బాగోతంబట్ట బయలు అవుతుంది విద్యార్థులు బస చేసే హాస్టల్ పరిశీలిస్తే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఉంటున్నాయని ఇట్టే
తెలిసిపోతుంది

ప్రత్యేక కమిటీ వేసి అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి . విద్యార్థి మేధావుల సంఘం నాయకులూ
గిరిజన సంక్షేమ హాస్టళ్ల పనీతీరుపై అదేవిధంగా కోట్ల రూపాయల స్కాం లను ఐఏఎస్ అధికారి తో ప్రత్యేక కమిటీ వేసి అవినీతి వెలికితీయాలి. అదేవిధంగా అవినీతి చేసిన అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలి. అధైవసరంగా సమీక్షించి హెడ్మాస్టర్ లు డిప్యూటీ వార్డెన్ గా కొనసాగుతున్న వారి ఆస్తుల పై విచారణ జరిపించాలని .కొత్త ప్రభుత్వంలో విద్యార్థుల తీరు మారుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ పై ప్రత్యేక దృష్టిపెట్టి తీరుమారిస్తేనే హాస్టళ్ల అవినీతి మకిలి పోతుంది . అక్రమంగా హెచ్ డబ్ల్యూ ఓ గా కన్వేషన్ అయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల ప్రాపకంలో పనిచేసి అవీనితికి పాల్పడిన అవినీతి వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని టీజీవిఎం ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం రాయ్ తెలిపారు .