వినియోగ విద్య పౌరులందరికి అవసరం.
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం లో*
“మైస శ్రీనివాసులు”
తొవ్వన్యూస్.ఇన్//9398236146

దేశంలో ప్రతి పౌరుడికి వినియోగదారుల కు ఉపయోగపడే సంబంధ విద్య తెలిసి వుండాలని అది చాలా ప్రాముఖ్యమైనదని మహబూబాబాద్ వినియోగ దారుల సంక్షేమ మండలి ప్రధాన కార్యదర్శి “మైస శ్రీనివాసులు” అన్నారు శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాఠశాల ఇంచార్జి ప్రాధానోపాధ్యయురాలు కే. గిరిజ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 24 న నిర్వహిస్తున్నారన్నారు. దేశంలోవినియోగ విద్య అవగాహన లేకపోవడం వల్లనే పౌరులందరూ తమ దైనందిన జీవితంలో అనేక సార్లు మోసానికి గురిచేయబడి, ఆరోగ్యపరంగా,ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల రక్షణ చట్టం అందరికీ చేరేలా అవగాహన కల్పించేందుకు ముందుకు రాకపోవడం కారణమన్నారు. ప్రభుత్వలే సందర్భాన్ని బట్టి ప్రతి వినియోగదారుడికి హక్కులు తెలియజేయాలన్నారు. కొనుగోలుసేవల్లో మోసపోకుండా చూడాలని అన్నారు.
నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకూ ప్రతి మానవుడు నిర్వహించే దైనందిన కార్యక్రమాల్లో వినియోగదారుల విద్య ఉంటుందని దాన్ని వాడుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని లేనట్లయితే నేడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపార వర్గాలు అన వసరమైన వస్తువులను వినియోగదారులకు ప్రచారాల పేరిట అవసరం లేకున్నా అంటకడుతున్నారని తెలిపారు.నకిలీవస్తువులు, కల్తీ ఆహరపదార్థాలు దేశం లో విచ్చలావిడిగా విక్రాయించబడుతున్నాయని.. ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో విఫలమవుతున్ననందున వినియోగదారులు నష్టపోతున్నారని గుర్తు చేశారు.రాష్ట్రప్రభుత్వం లో గత పది సంవత్సరాలుగా వినియోగదారుల రక్షణ చట్టంనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని,దీనివలన తెలంగాణలో అక్రమ వ్యాపారాలు పెరిగిపోతున్నయని.ప్రభుత్వం వినియోగదారుల చట్టాన్ని అమలు పరుచుటకు ఇందుకు సంబందించిన వివిధ శాఖలలో పోస్టులసంఖ్యను పెంపుదల చేసి, వాటిని భర్తీ చేసి..వారందరు క్షేత్ర స్థాయిలో పనిచేసే విదంగా తగు విదంగా చర్యలు చేపడితే.. అందరికి ఉపయోగపడే చట్టం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని అన్నారు. అనంతరం
ఎల్పిజి సిలిండర్ వినియోగం అవగాహన పట్ల భారత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ప్రసాద్ సదస్సులో రక్షణ చర్యలు ఎలా చేపట్టాలి అని వివరంగా ఎలా గ్యాస్సిలిండర్ వినియోగించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం బాధ్యులు sk.జానీ,జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీవాణి, ఉపాధ్యాయినులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

