సాయంత్రం నుంచి ప్రత్యేక ప్రార్థనలు….
తొవ్వ న్యూస్.ఇన్//9398246146

జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబు అవుతున్నాయ్.ప్రపంచ శాంతి ప్రేమికుడు యేసుక్రీస్తు జననం మానవాళికి పండుగ దినం అని .శాంతి ప్రేమ కరుణ మానవాళి ముఖ్య సందేశం అని క్రీస్తు చూపిన మార్గమే సర్వ మానవాళికి ఉపయోగకరమని చర్చి ఫాదర్లు, సంఘ కాపరులు వ్యాఖ్యోపదేశాకులు తెలిపారు.డిసెంబర్.25 క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలుమండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. యువకులు ప్రధాన వీధుల్లో భారీ నక్షత్రాలను విద్యుత్ దీపాలను ఆకర్షణీయంగా అలంకరణ ఏర్పాటు చేశారు. క్రైస్తవులు వారి గృహల వద్ద నక్షత్రాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో చేయడం జరుగుతుందని దేవ దూత క్రీస్తు నామం ప్రతి ఒక్కరూ మదిలో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.
దీవెనకరంగా క్రిస్మస్ వేడుకలు పాస్టర్ :లివింగ్ వాటర్
ప్రపంచ శాంతి సందేశం అయినటువంటి క్రీస్తు నామముతో సర్వ మానవాళి వెలుగు దివ్వెలు అందుతునాయ్యని ఆయన.అన్నారు ఈరోజు సాయంత్రం 7గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు వుంటాయని అన్నారు.

