దిన దినంగా మండలంలోని ప్రతీ కుటుంబానికి చేరువవుతున్న” చిలువేరు” సేవలు
మతాలకతీతంగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “క్రిస్మస్ కిట్లు” అందజేత
చర్చి పాస్టర్లకు సమ్మీ గౌడ్ క్రిస్మస్ పండగ కిట్లు పంపిణీ…
సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రావడం హర్షణీయం పాస్టర్ ల సంఘం జిల్లా అధ్యక్షులు “పిల్లి కుమారస్వామి.”
తొవ్వన్యూస్.ఇన్ 9398236146

తనకున్న దానిలో సమాజానికి అందించాలనే ఆలోచన రావడం హర్షణీయం సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోపా డివిజన్ అధ్యక్షులు,కేసముద్రం మండల కాంగ్రెస్ నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆ భావంతో సేవే మార్గం గా ప్రజల్లోకి వెళుతున్నారుగత కొన్ని సంవత్సరాలుగా తన స్వంత డబ్బు తో పలు కార్యక్రమాలు చేసి ప్రజలు అధికారుల చేత మన్ననలు పొందారు . ఆదివారం క్రిస్మస్ పర్వదినం పురస్కరినుంచుకొని కేసముద్రం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన చర్చిల పాస్టర్లకు ఎస్ జీ ఎఫ్ ఆధ్వర్యంలో 3వేల రూపాయలకు పైగా విలువైన నిత్యవసర వస్తువులు, అందజేశారు.. ఈ సందర్భంగా పాస్టర్ ల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పిల్లి కుమారస్వామి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న చందంగా చిలువేరు సమ్మయ్య గౌడ్ తాను సంపాదించిన ఆదాయంలో కొంత సమాజ సేవకు వెచ్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమ్మి గౌడ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమ్మిగౌడ్ మాట్లాడుతూ ఏసుప్రభు దేవుడి సేవకులకు సహాయం చేయటం నా అదృష్టం గా భావిస్తున్నాని ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు విక్టర్ పాల్, జోసఫ్, సురేష్, ప్రభు జీవన్, మహేందర్, ఇశ్రాయేల్, సుధాకర్, ఫిలిప్, జాన్ వెస్లీ, ఎమ్మెస్ రత్నం, లాల్ సింగ్, పోలేపాక నాగరాజు, దేవరాజు ఈశ్వర్,నాగేల్లి తదితరులు పాల్గొన్నారు

