మహబూబాబాద్ జిల్లాలోని ముఖ్య సంక్షిప్త వార్త స్రవంతి…
తొవ్వ న్యూస్ .ఇన్.9398236146



స్వాతంత్ర సమరయోధుడు పోతుగంటి రామస్వామి ఆశయాలు కొనసాగించాలి…
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తామ్ర ప్రత గ్రహీత, పోతుగంటి రామస్వామి ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకుపోవాలని, తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రాపర్తి యాదగిరి అన్నారు.సోమవారం జిల్లాలోని కొరివి మండలం నెరడ గ్రామంలో రామస్వామి స్వగృహంలో జరిగిన సంతాప సభలో ఆయన సమాజానికి చేసిన సేవలు కొనియాడారు…ఆయన భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాల కు వైద్య విద్యార్థులు భవిష్యత్తు కోసం ఇచ్చిన తీరును ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర ప్రతినిధి సింగు రమేష్, నాయకులు చిలుకపల్లి ముత్తులింగం, నామ పద్మాకర్, ముత్తయ్య చారి, మదనాచారి, రామస్వామి కుటుంబ సభ్యులు జానాబాయి, కృష్ణ చైతన్య లతోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

శబరి యాత్రకు తరలిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.. సోమవారం శబరి యాత్రకు తరలి అయ్యప్ప ఆలయంలో ఆలయంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి తో పాటు ఇరుముడి ధారణ చేశారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు.చైర్మన్ కుటుంబ సభ్యులు బి అర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో పాలకుర్తి పెద్దమ్మ…..
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి నియోజవర్గ ఇంచర్జ్. ఝాన్సీరెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం స్వామివారికి మోక్కులు చెల్లించేందుకు సోమవారం పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి తిరుమల మెట్ల మార్గం ద్వారా వెళ్ళారు సాయంత్రం ప్రత్యక దర్శనం చేసుకున్నారు.


క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ముందుగామహబూబాద్ టౌన్, జమండ్లపల్లి గ్రామంలో చిట్టోజు పాపాచారి స్వగృహంలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసముద్రం పట్టణ కేంద్రంలోని పలు కాలనీలలో ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారుఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బండారు వెంకన్న, సీనియర్ నాయకులు బండారు దయాకర్, సర్పంచ్ బట్టు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రావుల మురళీ,వసంతరావు, తరాల సుధాకర్,ఎండీ అయుబ్ ఖాన్, చిలువెరు సమ్మయ గౌడ్, దమరకొండ ప్రవీణ్, ఎండీ నవాజ్, కమల్, శంకర్,బాధ్య, చిట్లా సంపత్, మహేష్, వీరేష్ యాదవ్, జల్లేంపల్లీ శ్రీను,జలేందేర్, వీజెందేర్, రామచందర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అల్లం గణేష్, మండల అధ్యక్షులు గొల్లపల్లి మహేందర్, బడవత్ సుమన్, ఎండీ రియాజ్,పని, సమీర్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు..

మాజీ ప్రధానీ స్వర్గీయ వాజ్ పెయ్ 99 వ జయంతి వేడుకలు
అటల్ బీహార్ వాజపేయి 99వ జయంతి
వేడుకలు పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ధవాఖానా లో పండ్లు, బ్రేడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు. మాజీ అధ్యక్షులు సీతయ్య. నియోజకవర్గ నాయకులు మురళి. శ్రీనివాస్ .బోనపల్లి లక్ష్మణరావు. శ్యాంసుందర్ దార ఇందు భారతి, జీనుక రామూర్తి, వలపదాసు భద్రయ్య, మారగని రాజు,జెల్లీ ప్రశాంత్,గంగుల శ్రీధర్,చుక్కల నరేష్,పల్లె సందీప్, కోటి, సురేందర్,సురేష్,రాజు తదితరులు పాల్గొన్నారు .

తిరుమల స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కవిత
తిరుమల శ్రీవారిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యు రాలు మలోత్ కవిత బి అర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు హరిత,డిఎస్ రాజేంద్రప్రసాద్-సుష్మ దంపతులు,భారస నాయకులు రాహుల్ నాయుడు,అజయ్ గౌడ, మహతి తదితరులు..పాల్గొన్నారు