ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలకు …
మాజీ కార్పొరేటర్ గా భార్య కల్పన, పర్వతగిరి జడ్పిటిసి గా” సింగ్ లాల్” సేవలు
“కరోనా” సమయంలో వంగపహాడ్ ఆరెపల్లి లయోలా కాలనీలో బాధితులకు అండనిచ్చిన దంపతులు
తొవ్వ న్యూస్.ఇన్ //9398236146…

మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఆశావహుల్లో పర్వతగిరి జడ్పిటిసి ఉన్నత విద్యావంతుడు బానోత్ “సింగ్ లాల్” పోటీ పడుతున్నారు తన ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యజించి రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆయన పత్రిక ముఖంగా మంగళవారం తెలియజేశారు . జిల్లా కేంద్రంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన పరిచయ కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్థానం కుటుంభం నేపధ్యం తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి తన పుట్టిన వూరు అని తన తల్లిదండ్రులు వ్యవస్యాయ దారులని చిన్నపటి నుంచి చదువు మీద మక్కువతో గిరిజన సంక్షేమ హాస్టల్ లో చదివి రెవిన్యూ విభాగంలో విఆర్వో గా ఉద్యోగం ప్రారంభించడం జరిగిందని రెవిన్యూ సమస్యలపై ప్రజలకు అనేక వేదికలపై ఆవగాహన కల్పించడం జరిగిందని గూడూరు మండలంలో విఆర్ ఓ గా పనిచేసే చోట ప్రజల స్థితిగతులు అవలోకనం చేసుకొని రాజకీయాల్లోకి రావడానికి కృషి సల్పడం జరిగిందని ఆనాటి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాన్నికి రాజీనామా చేయలేక అటు ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని వదులుకోలేక భార్య కల్పన 2006 లో గూడూరు సర్పంచ్ గా పోటీచేయించడం జరిగిందని ఓటమి చవి చుసిన పట్టు వదలని విక్రమార్కునిలా రాజకీయ పోరాటం చేస్తూనే అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగంపై బదిలీ తో వరంగల్ చేరుకొని పట్టణంలో పేదలకు సేవ చేయడానికి అనేక కార్యక్రమాలు చేయడం అంతేకాకుండా అనాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలిక భూమిక పోషించడం ప్రజలు మెచ్చి తన భార్య కల్పనను 2,,58 డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నుకోవడం జరిగిందని ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రస్తుత వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి జడ్పిటిసి తాను పోటీ చేసి గెలుపొంది ప్రజా తీర్పు మారిన రాజకీయ సమీకరణాల దృశ్య కాంగ్రెస్ పార్టీలో చేరి వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు గెలుపులో ప్రధాన భూమిక పోషించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తనకు గట్టి హామీ ఇవ్వడం జరిగిందని మహబూబాబాద్ పార్లమెంట్ సీటు తనకు కానీ తన భార్య కల్పన కు ఇద్దిరిలో ఎవరికీ ఇచ్చినమహబూబాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సంగీలాల్ తెలియజేశారు ,ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనలకు జరుగుతున్న అన్యాయాలపై గళం ఎత్తారు . తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ ఎస్ లో 12 శాతం రిజర్వేషన్ అమలు కాలేదని ఉద్యోగుల్లో రావల్సిన బెనిఫిట్స్ ఎవరికీ అందలేదని అన్నారు .మహబూబాబాద్ ప్రజలు దీవించి కాంగ్రెస్ నాయకులూ మీడియా తనకు మద్దతు అందించాలన్నారు
