“గంజాయి లాంటి మత్తుపదార్ధాల పై ఉక్కుపాదం..”
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక వెల్లడించిన జిల్లా ఎస్పీ “సంగ్రమ్ సింగ్ జి పాటిల్ “
తొవ్వ న్యూస్.ఇన్ 9398236146

మహబూబాబాద్ జిల్లా పోలీస్ వార్షిక నివేదిక 2023 ను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్ గురువారం వెల్లడించారు ప్రజల శాంతి భద్రతలే పోలీసుల పరమావధి … అని అయన మాట్లాడుతూ 2023 సం. లో జిల్లాలో 10 హత్య కేసులు, 222 ఆస్తి సంబంధిత నేరాలు, 6 నేరపూరిత నరహత్యలు (culpable Homicide ), 51 కిడ్నాప్ కేసులు, 44 రేప్ కేసులు, 474 గాయాలు కేసులు, 202 మోసపూరిత నేరాలు, 56 ఎస్సి ఎస్టీ నేరాలు, 58 POCSO చట్టం కేసులు, 10 గంజాయి కేసులు, 51 సైబర్ నేరాలు, 117 మహిళల పై అఘాయిత్యాల కు సంబంధించిన కేసులు నమోదు అయినవి. కాగా గత సం. లో 27 హత్య కేసులు, 205 ఆస్తి సంబంధిత నేరాలు, 11 నేరపూరిత నరహత్యలు (culpable Homicide), 67 కిడ్నాప్ కేసులు, 52 రేప్ కేసులు, 472 గాయాలు కేసులు, 270 మోసపూరిత నేరాలు, 45 SC/ST నేరాలు, 64 POCSO చట్టం కేసులు, 11 గంజాయి కేసులు, 59 సైబర్ నేరాలు, 107 మహిళల పై అఘాయిత్యాల కు సంబంధించిన కేసులు నమోదు అయినవి. గత సంవత్సరంతో పోల్చగా… హత్య కేసులు 62.96 % తగ్గినవి. ఆస్తి సంబంధిత నేరాలు 8.29% పెరిగినవి.నేరపూరిత నరహత్యలు (culpable Homicide ) 45.45 % తగ్గినవి. కిడ్నాప్ కేసులు 23. 88 % తగ్గినవి.రేప్ కేసులు 15.38 % తగ్గినవి.గాయాలు కేసులు 0.42 % పెరిగినవి. మోసపూరిత నేరాలు 25.18 % తగ్గినవి. SC/ST నేరాలు 24.44 % పెరిగినవి. POCSO ACT కేసులు 9.37 % తగ్గినవి.గంజాయి కేసులు 9.09 % తగ్గినవి.సైబర్ నేరాలు 13.55 % తగ్గినవి. మహిళల పై అఘాయిత్యాలు 9. 34 % పెరిగినవి. శాంతి భద్రతలు : శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా 2023 సం. లో 6205 మంధి పాత నేరచరిత్ర గల వారిని బైన్డోవర్ చేయటం జరిగినది. పోలిస్ గ్రామ సందర్శన మరియు పోలిస్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, పోలీసు పెట్రోలింగ్ పెంచడం వల్ల కమ్యూనిటీ గ్రూపుల మధ్య గొడవలు గాని, మరేఇతర అల్లర్లు గాని జరగకుండా చేయగలిగాము. నిషేదిత మావోయిస్టు పార్టీ వారు వారి ఉనికిని చాటుకోవటం కొరకు మన జిల్లాలోనికి ప్రవేశి౦చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే సమాచారం ముందస్తుగా తెలుసుకొని మన స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో 2023 సం. లో కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహించి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండ చర్యలు తీసుకోవటం జరిగినది., 22.09.2023 న గూడూరు మండలంలో మావోయిస్టు పార్టీకి కొరియర్స్ గా పని చేస్తున్న నలుగురు వ్యక్తులను 1)Bhandari Brahmaiah s/o Chandraiah, Manchiriyala District. 2)Perumandla Vidya Sagar s/o Venkanna, Nellikuduru, Mahabubabad District. 3) Arakula Srinivas s/o Gangaiah, Manchiriyala District and 4) Bhukya Srivinas s/o Somala, @ Ponugodu Srinu, 35 yrs, ST Lambada వీరిని ముందస్తు సమాచారం మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగినది .

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు-2023:
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తేదీ నుండి జిల్లా పోలీస్ బలగాలు ఏరియా ఆధిపత్య పార్టీలను నియమించాయి మరియు జిల్లాలొ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి మరియు స్వేచ్చా నిష్పక్షపాత ఎన్నికలకు ముప్పు కల్గించే సిపిఐ (మావోయిస్ట్) కదలికలను అరికట్టాయి దానికి తోడు మహబూబాబాద్ జిల్లా పోలీసులు కూడా దుర్బల గ్రామాలలో cordon అండ్ search ఆపరేషన్లు నిర్వహించి ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని పెంచారు. మహబూబాబాద్ జిల్లా తీవ్రవాద ప్రభావిత జిల్లా కావడంతో విధ్వంసకర సంఘటనలు జరగకుండా రోడ్డు, కల్వర్టు తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. నేరాలను అరికట్టడానికి పోలీసులు గతంలో నేరచరిత్రను కలిగి ఉన్న 6052 వ్యక్తులను బందించారు మరియు ఎన్నికల సమయంలో ఎలాంటి హింసకు పాల్పడవద్దని బాండ్ లు తీసుకున్నారు. TSLA-2023 ఎన్నికలు ఏ ఒక్క సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినాయి.
కేసుల దర్యాప్తు – విచారణ
2023 సం. లో మొత్తం 1543 కేసులలో తుది తీర్పు వెలువడగా, అందులో 501 కేసులలో నేరనిరూపణ జరిగినధి. వీటిలో నేరస్థులకు ముఖ్యముగా రెండు (02) హత్య కేసులలో ఒకరికి మరణ శిక్ష , జీవిత ఖైధు శిక్ష, రెండు (02) రేప్ కేసులలో ఒకరికి జీవిత ఖైధు శిక్ష, మరొక కేసులో నేరస్థునికి 20 సం. జైలు శిక్ష, రెండు (02) కట్నం కోసం వేధించి చంపిన కేసులలో ఒక నేరస్థునికి 17 సం. జైలు శిక్ష మరియు ఇంకో నేరస్థునికి 10 సం. జైలు శిక్ష పడ్డాయి, మరియు మరో 586 కేసులు రాజీ కాబడినవి. మొత్తముగా ఈ సం. లో నేర నిరూపణ రేటు 32.47 % గా ఉండినది. దీన్ని మరింత పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
ఆస్తి సంబంధ నేరాలు – రికవరీ :
2023 సం. లో 222 ఆస్తి సంబంధిత నేరాలలో 1,76,24,101/- రూ విలువ గల నగధు/ ఆభరణాలు /ఇతర వస్తువులు దొంగిలించబడగా, 114 కేసులు గుర్తించబడి 90,76,741/- రూ రికవరీ చేయబడినది. 2022 సం. లో 190 ఆస్తి సంబంధిత నేరాల కేసులు నమోదు కాగా, 107 కేసులు గుర్తించబడినవి. గత సం . తో పోల్చగా ఆస్తి సంబంధిత నేరాలు 8. 29 % పెరిగాయి మరియు చేదించిన కేసులు 3% తగ్గినాయి.
SC/ST (POA) చట్ట నేరాలు:
2023 సం. లో 56 SC/ST కేసులు నమోదు కాగా, అందులో 33 కేసులలో బాధితులకి మొదటి స్టేజ్ లో Rs. 10,00,000/- మరియు 15 కేసులలో రెండవ స్టేజ్ లో Rs. 10,00,000/- గౌ. జిల్లా కలెక్టర్ గారు పరిహారం ఇచ్చినారు.
రోడ్డు ప్రమాదాలు :
2023 సం. లో 278 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 126 మంది మరణించారు,277 మంది గాయపడినారు. 2022 సం.లో 279 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాబడి 141 మంది మరణించినారు, 274 మంది గాయపడినారు. గత సం. తో పోల్చగా రోడ్డు ప్రమాదాలు 0.35 % తగ్గినాయన్నారు. గంజాయి లాంటి మత్తుపదార్ధాల పై ఉక్కుదం మోపుతామని ప్రజల ఫిర్యాధులు స్వీకరించడానికి ఎల్లపుడు అందుబాటులో ఉంటాం.విధుల పట్ల మహబూబాబాద్ జిల్లా పోలీసుల అంకితభావం హర్హనీయం…సైబర్ నేరలను నియంత్రణలోకి రావాలి అంటే ప్రజలకు అవగాహనా అవసరంరోడ్డు ప్రమాదల నివారణకు పోలీస్ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది..మీడియా ద్వారా ప్రజలకు అవగాహనా కల్పించనున్నట్టు తెలిపారు .కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తీర్థాల సత్యనారాయణ తోఱురు డిఎస్పీ వెంకటేశ్వరబాబు , జిల్లాలోని సిఐ లు ఎస్సై లు సిబ్బంది పాల్గొన్నారు