సబ్ రిజిస్టర్ “తస్లీమ్ మహమ్మద్ “ఆధ్వర్యంలో ఘనంగా “హరికోట్ల” జన్మదిన వేడుకలు
“రవన్న “సేవలు మరువలేనివి పలువురు ప్రశంసలు
తొవ్వ న్యూస్.ఇన్.//9398236146:

ప్రజలకోసం జీవిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చిరకాలం గుర్తిస్తారనే మాటకు బెస్ట్ ఉదాహరణ “హరికోట్ల రవి” అని నేటి సమాజంలో మానవతా మూర్తిగా ఎంతో మందికి ఆదర్శం గా నిలుస్తూ పూలే అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాడని మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ “తస్లీమ్ మహమ్మద్” అన్నారు .గురువారం ఉమ్మడి జిల్లా రిజిస్టర్ హరికోట్లరవి జన్మదిన వేడుకలు స్థానిక ఆశ భవన్ అనాధ శరణాలయంలో విద్యార్థులు చిన్నారులు పుర ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆశ్రమ నిర్వాహకులు విజయకుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా సబ్ రిజిస్టర్ తస్లీమ్ , రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు పిల్లి సుధాకర్ జిల్లా డాక్యుమెంటర్ రైటర్ అసోసియేషన్ అధ్యక్షలు ప్రకాష్ హాజరై మాట్లాడుతూ హరికోట్ల మహబూబాద్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు .13 సంవత్సరాలు ఒకే కార్యాలయంలో పనిచేసిన అనుభవం మానవ విలువలు తో కూడిన సత్సత్సబంధాలు నెమరువేసుకున్నారు . ముఖ్యంగా అయన ఎంతోమంది పేదలకు సహాయం చేసారని ఏనాడూ అయన తన పేరు బయటకు చెప్పుకోలేదన్నారు. సబ్ రిజిస్టర్ తస్లీమ్ మహమ్మద్ మాట్లాడుతూ హరికోట్ల నిజమైన పూలే.అంబేత్కర్ వారసుడని జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులుగా ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చిన “తల్లడిలుతు ముందు నిలిచే ఉద్యోగ సంఘాల ఉద్యమ నాయకుడని అన్నారు.తాను ఉద్యోగ రీత్యా ములుగు భూపాలపల్లి జిల్లాలో పనిచేసే క్రమంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు అనేక సోషల్ కార్యక్రమాలు చేయడం దానిపై ఏమైనా విమర్శలు వచ్చిన వెంటనే తన అన్నగా “హరికోట్ల” పై అధికారులకు సమాధానం చెప్పి అండగా నిలిచారని కరోనా సమయంలో ఆదివాసీ ప్రాంతాల కు నిత్యావసరాలు పంపారని నేటి సమాజంలో ఒక్కరూపాయి దానం చేస్తేనే ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే క్రమంలో “హరికోట్ల” కొన్ని వందల కుటుంబాలను ఆదుకొని ఏనాడూ తన ఫోటో కానీ పేరును కానీ బయటకు రానివ్వలేదని గుర్తు చేశారు. అయన లాంటి మానవత మూర్తి రాజకీయాలకి వస్తే ప్రజలకు మరింత సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారికి నూతన వస్త్రాలను అందించారు. దాతల సహకారం తో అనాధ శరణాలయానికి వాటర్ కూలర్ అందించారు . ఈ సందర్బములో జిల్లా లేఖరుల సంఘం అధ్యక్షులు ప్రకాష్ అనాధశరణాయ వాహనం కోసం కొంత ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాస్టర్ లివింగ్ వాటర్ , ఉద్యోగులు మధు అనిత మార్తమ్మ లేఖరులు యశ్వంత్ గాండ్ల కిరణ్ పాషా సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు .



తొర్రూరు

ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా వస్తా……
పుట్టినరోజు వేడుకల్లో రిజిస్ట్రారు” హరికోట్ల“…..
తొవ్వ న్యూస్.ఇన్ 9398236146..//
ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా ప్రతినిధిగా సేవ చేయడానికి ప్రజాక్షేత్రంలోకి రావడానికి తనకు ఎలాంటి సంకోచంలేదని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రారు హరికోట్ల రవి తన పుట్టినరోజు సందర్భంగా తన మనోగతం వెల్లడించారు. గురువారం డివిజన్ కేంద్రమైన తొర్రూరులో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, పోలీట్ బ్యూరో చైర్మన్ అషోధ భాస్కర్ ల నేతృత్వంలో డివిజన్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ లో సబ్ రిజిస్ట్రారు గా, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో రిజిస్త్రారు గా సేవలందిస్తున్నానని, ఇకపై ప్రజాక్షేత్రంలో ఎంపీగా సేవలందించాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని అందుకు ప్రజలతో పాటు జాతీయ మాల మహానాడు సంఘం సంపూర్ణ మద్దతును అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన డివిజన్ కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్
జిల్లా నాయకులు బొడ్డు అశోక్, గంపల శంకర్ , జిల్లా అధికార ప్రతినిధి చిట్టిమల్ల మహేష్, జిల్లా ప్రచార కార్యదర్శి చెదల యాకాంతం మండల నాయకులు యనమాల రాకేష్ గంపల ప్రవీణ్ అనిల్ అనపర్తి నాగేష్ ధర్మయ్య గోపి పాల్గొన్నారు