కలెక్టర్ శశాంక సేవలు కొనియాడిన అధికారులు…
నూతన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు స్వాగత సన్మానాలు.
తొవ్వ న్యూస్.ఇన్//9398236146

జిల్లాకు ఉద్యోగరీత్యా ఎంతోమంది పాలనాధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ప్రజల్లో నిలిచిపోయేలా సేవలు చేస్తూ ఉన్నత ఆశయంతో ప్రజల మధ్యలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే అధికారులు ఎక్కడ పని చేసిన ప్రజల గుండెల్లో జీవిస్తారని.. పలువురు ఉన్నతాధికారులు బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ శశాంక ప్రశంసించారుఆదివారం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన నూతన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సాధర స్వాగతం… అదేవిధంగా బదిలీపై వెళ్లిన కలెక్టర్ శశాంకకు ఆత్మీయ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధికారులు జర్నలిస్టు సంఘాల నాయకులు పట్టణ పుర ప్రముఖులు కలెక్టర్ చేసిన సేవలు కొనియాడారు జిల్లా ఐజేయు అధ్యక్షులు చిత్తూనురు శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ శశాంక మానుకోట జర్నలిస్టులు 58 మందికి ఇళ్ల పట్టాలిచ్చి చరిత్రలో నిలిచారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ పథకాల చేరవేయడంలో తనదైన ముద్రవేశారని జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించి మన్ననలు పొందారని గుర్తు చేశారు నూతన జిల్లా అయిన మహబూబాబాద్ కు ఆయన హయాంలోని మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. రాజకీయ ఒత్తిడి లకు తలగ్గొక్క తన మార్కు చూపించారన్నారు. నూతనంగా వచ్చిన యంగ్ డైనమిక్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సాధర స్వాగతం పలుకుతూ జిల్లా పరిస్థితులను అలౌకగా వివరించారు త్వరలో వారి మార్కు కూడా ఈ జిల్లాలో కనిపించబోతుందని ప్రజలకు పాలన చేరువ కానుందని అన్నారు. అనంతరం పలు విభాగాల అధికారులు నూతన కలెక్టర్కు స్వాగతం బదిలీపై వెళ్లిన కలెక్టర్ కి వీడ్కోలు చెప్తూ సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని విభాగాల ముఖ్య అధికారులు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు
