శంకర్ నాయక్ ను శంకరగిరి మాన్యాలు పట్టించారు…
పేదలకు “భూ పోరాటానికి “ఎంతకైనా తెగిస్తాం
ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే కోమ్ము కాసారా…అధికారులు తీరుపై మండిపడ్డ నాయకులు.
తొవ్వ న్యూస్.ఇన్//9398236146

గత పాలకుల చెప్పు చేతల్లో మెలిగి మాజీ ప్రజాప్రతినిధి శంకర్ నాయక్ మెప్పుకోసం పేదల గుడిసెలను కూల్చడం అమానుషమని అధికారుల తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుంకర వీరయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదల గుడిసెల కోసం మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వంలో నాయకులు ఇంకా కొలువు తీరకముందే సమస్యలు అలవోఖం చేసుకోకముందే అప్పులు ఆస్తులు లెక్క కట్టకముందే ఆగమేగాలపై పాత ప్రభుత్వానికి కొమ్ము కాస్తు పేదల గుడిసెలను కూల్చి తినే బియ్యంలో మట్టి పోసి కంచం చెంబు చంచా అనే తేడా లేకుండా డోజర్ బకెట్లతో బయటకు గిరాటువేసరని అధికారుల తీరును ఎండగట్టారు.. ఇప్పటికి శంకర్ నాయక్ కొమ్ముకాస్తున్న అధికారుల తీరును ప్రశ్నించారు. కబ్జాకు గురి చేసిన భూములు ఎక్కడ పోతాయని ముందుగానే మేల్కొని మాజీ ప్రజాప్రతినిధులు అధికారులతో భూములను కబ్జా చేపిస్తున్నారని అన్నారు పేదల భూ పోరాటానికి ఎంతకైనా తెగిస్తామని ఎర్రజెండా అండగా పేదలకు పట్టాలు వచ్చే వరకు పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమయ్య. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు. నాయకులు గునిగంట రాజన్న. సమ్మెట రాజమౌళి. నాగన్న కుర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.


