కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు…
గోదా కళ్యాణం. విశిష్టతపై తోవ్వ .ప్రత్యేక కథనం…
తోవ్వా న్యూస్.ఇన్.//9398236146.

జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన.అనంతద్రి జగన్నాథ బలభద్ర సుభద్ర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం రుత్వికులు ఆచార్యులు సమక్షంలో వేదమంత్రాలు నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ దంపతులు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భరత్ చందర్ రెడ్డి. హాజరై స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు దేవాలయ ప్రధాన అర్చకులు చక్రధరచార్యులు శ్రావణ్ భక్తులుకు తీర్థ ప్రసాదాలు అందించి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కోడి శ్రీనివాస్, విజయ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు.


గోదా కళ్యాణం విశిష్టత
అలౌకికమైన, వినిర్మలమైన ప్రేమ కథ…
శ్రీవిల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడనే పెద్దమనిషి. ఆయనకు సర్వం కృష్ణుడే. ఆయన పూజ చేయందే తెల్లవారదు. ఆ భక్తి కారణంగానే ఆయన ఆళ్వారుల్లో ఒకరై పెరియాళ్వారనే పేరును పొందారు. విల్లిపుత్తూరులోని ఆలయంలో ఉన్న వట పత్రశాయికి రోజూ పుష్పమాలా కైంకర్యం చేస్తూ ఉండేవాడు. పుష్ప మాలల కోసం… అలాగే స్వామికి తులసి దళమాల సమర్పణ కోసం అక్కడొక తులసి వనం ఉండేది. ఆ వనంలోని పుష్పాలు తులసీదళాలతో పూలమాలలు అల్లి స్వామికి సమర్పిస్తుండేవారు. ఓ రోజు ఆ వనంలోని ఒక తులసి పాదులో ఓ బంగారు తల్లి విష్ణుచిత్తుడికి కనిపించింది. ఆ శిశువుకు కోదై అని పేరు పెట్టారు పెరియాళ్వారు. కోదై అన్న పదమే కాలక్రమంలో గోదాగా మారింది.ఇక ఆ చిన్నారి సందడి చూడాలి… చిన్నప్పటి నుంచి కోదై తన తండ్రి చేస్తున్న శ్రీకృష్ణ పూజను ఎంతో ఇష్టంగా చేస్తుండేది. ఆమెకు యుక్తవయస్సు వచ్చేసరికి తండ్రి పూజిస్తున్న ఆ వటపత్ర శాయి మీద మరింత మనస్సు లగ్నమైంది. ఆ ఇష్టమే అలౌకిక ప్రేమగా మారింది. ఆ అనంత ప్రేమ భావనలోనే నిత్యం లీనమై ఉంటూ ఉండేది. తన ప్రేమ భావనలను పాశురాలుగా మార్చి స్వామిని అర్చించింది. రోజుకొక్క పాశురం చొప్పున ముప్ఫై పాశురాలు రచించి తిరుప్పావై నోము నోచింది. ఈ వ్రతం చేసేటప్పుడు ఆ తల్లి ఆనాడు శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగా భావించుకుంది. అక్కడి ఆలయంలోని వటపత్రశాయిని ఆనాడు రేపల్లెలో ఉన్న కృష్ణుడిగా తలచింది. తన స్నేహితురాళ్లను గోపికలుగా ఊహించుకుని వ్రతాన్ని చేసింది.గోదామాతగా, ఆండాళ్ తల్లిగా అందరి పూజలు అందుకొంటున్న సాక్షాత్తు లక్ష్మీదేవి చేసిన వ్రతమే శ్రీవత్రం సిరినోముగాభావిస్తారు భక్తులు. ధనుర్మాస వ్రతం పేరుతోనెలరోజులపాటు నిర్వహించి…చివర్లో ఆ తల్లికి, శ్రీరంగనాథుడికి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.గోదామాత ఆవిర్భావం దైవసంకల్పం తప్ప మరొకటి కాదని భక్తులు నమ్ముతారు. ఆ తల్లి రచించిన ముప్ఫైపాశురాలువేదసమానాలయ్యాయి. ఆ తిరుప్పావై పాశురాలను ద్రవిడ ప్రబంధంగా ఈనాటికీ పండితులు ప్రశంసిస్తుంటారు.శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం పేరు
ఆముక్తమాల్యద ఆముక్తమాల్యద అంటే ముడిచి విడిచిన దండలను ఇచ్చిన అమ్మ అని అర్థం. గోదామాత ముందుగా తన కొప్పున ముడిచి ఆ తర్వాత విడిచిన దండలను శ్రీకృష్ణస్వామికి సమర్పించింది. అందుకే ఆ పేరొచ్చింది. ఈ అమ్మను తమిళ భాషలో శూడికొడుత్త నాచియార్ అని అంటారు. అన్నమాచార్యుడు కూడా అమ్మను కడుత్త నాంచారి అని స్తుతించాడు.
