ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఎమ్మెల్యేలు మురళి నాయక్ యషస్విని రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఝాన్సీ రెడ్డి వెన్నం శ్రీకాంత్ రెడ్డి.
అతిధులను సత్కరించిన “వేన్నం” దంపతులు..
తొవ్వ న్యూస్.ఇన్//9398236146.

రెడ్యాలగ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామాలయంలో గురువారం సాయంత్రం ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగ గా ఆచార్యుల వేద మంత్రోచరణాల నడుము అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఆలయ నిర్మాణ ప్రధాన ధర్మకర్త, పిసిసి అధికార ప్రతినిధి రెడ్యాల గ్రామ సర్పంచ్ “వేన్నం శ్రీకాంత్ రెడ్డి” దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్ మహబూబాబాద్ పాలకుర్తి శాసనసభ్యులు మురళి నాయక్ యశస్విని రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి హాజరై స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులకు విన్నం దంపతులు శాలువలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదం భోజన సదుపాయాలు “వేన్నం” కుటుంబం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అందించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రముఖులు హాజరయ్యారు.

