నర్సింహులపేట. తొవ్వ న్యూస్.ఇన్.9441635567
నర్సింహులపేట: గృహహింస కేసులో నిందితుడిపై నేరం రుజువు కావటంతో 3ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సరిత గురువారం తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామానికి చెందిన కొండా తేజస్విని, రమేష్ లు దంపతులు, వీరికి ఇద్దరు ఆడపిల్లలు. కాగా భర్త రమేష్ మగ బిడ్డ కోసం వేరొక పెళ్లి చేసుకొని మానసిక, శారీరిక వేధింపులకు గురిచేస్తున్నాడని 2014లో నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లో భార్య తేజస్విని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.ఈ క్రమంలో కేసు విచారనకు రాగ కోర్ట్ లో పోలీస్ వారు సాక్షణాలు ప్రవేశ పెట్టారు. ఏ పిపి గణేష్ ఆనంద్ కేసు ను వాదించగా సాక్షాదారాలు పరిశీలించిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నేరం రుజువు కావటంతో ముద్దాయి రమేష్ కి 3ఏళ్ల జైలు శిక్ష, విధించారు. సకాలం లో సాక్షులను కోర్ట్ లో ప్రవేశపెట్టి ముద్దాయి కి శిక్ష పడటం లో కృషి చేసిన కోర్ట్ పిసిని, తొర్రురు డిఎస్పీ వెంకటేశ్వరబాబు, సి సత్యనారాయణ, నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ లను అభినందించారు.