రెండు లక్షల బెల్లం పట్టివేత.ఇద్దరిపై కేసు నమోదు…
ఎస్సై సతీష్…..
తొవ్వ న్యూస్.ఇన్. 23.జనవరి 2024.//9398236146

మండలంలో నల్లబెల్లం అక్రమ రవాణా చేసిన ప్రభుత్వ నిషేధిత అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతామని
స్థానిక ఎస్సై సతీష్ హెచ్చరించారు.మంగళవారం అశోక్ లేయలాండ్ వాహనం లో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటల్లా నల్లబెల్లం స్వాధీనం,చేసుకొని ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వివరాలు వెల్లడిస్తూ మంగళవారం సాయంత్రంసుమారు 4 గంటల సమయంలో వంతడుపుల స్టేజి వద్ద పోలీస్ వాహనల తనిఖి చేస్తుండగా పోలీస్ వారిని చూసి అశోక్ లేయలాండ్ వాహనం రోడ్ ప్రక్కకు దూరం గా అపి పెట్టుకోగా పోలీస్ వారికి అనుమానం వచ్చి అట్టి వాహనం చెక్ చేయగా దానిలో ఉనక బస్తాలు కనిపించి బెల్లం వాసన వస్తుండటం తో చెక్ చేయగా ఉనక బస్తా ల క్రింద 40 బస్తాలు/20 క్వింటాల్ నల్లబెల్లం, 50 kg ల పట్టిక కనిపించినదనీ పోలీస్ వారు, డ్రైవర్ నీ అతనితో వున్నవారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు నేతావత్ వెంకటేష్, నేతవత్ తండా, మరిపెడ, చినపాక వెంకన్న గ్రామం సన్నూరు అని తెలిపి చిత్తూరు నుండి బెల్లం తీసుకొని వచ్చి తండా లలో అమ్ముతున్నట్లు చెప్పినారు.ఇద్దరిపై కేసు నమోదు చేసి అశోక్ లేయలాండ్ వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ. స్వాధీనం పరుచుకున్న బెల్లం విలువ సుమారు 2 లక్షలు ఉంటుందనీ
తెలిపారు అక్రమంగా నల్ల బెల్లం పట్టిక, ఇసుక గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఎవరైనా అక్రమంగా వ్యాపారం చేస్తే పోలీసు వారికి తెలియపరచాలని ఆయన మండల ప్రజలను కోరారు.