రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత…
మహనీయుల స్ఫూర్తి తోనే రాజకీయాల్లోకి
ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి..
Thovva web news.25.Jan.Thursday

అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఈ దేశానికి రక్షణ కవచమని 75 వ గణతంత్రం వేళ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్ హరికొట్లా రవి అన్నారు.వరంగల్ జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా75 వ గణతంత్ర దినోత్సవం, ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మాల మహానాడు,కుల ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ములుగు రోడ్డు పూలే విగ్రహం నుంచి కూడా హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వరకు ఏర్పాటు చేసిన “రాజ్యాంగ సద్భావన ర్యాలని భారీ ద్విచక్ర వాహనల తో రాజ్యాంగ స్ఫూర్తి పెంపొందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ
*రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ యువతదేఅని
అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుదంను సద్వినియోగం చేసుకోవాలనిగ్రామ గ్రామన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే. రాజకీయాల్లోకి వచ్చి ప్రజ సేవ చేయాలని సంకల్పించినట్టు ఆయన మనసులో మాట తెలిపారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగుతున్నట్లు చూచాయగా. తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్,జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు,పొలిట్ బ్యూరో చైర్మన్ అశోద భాస్కర్,రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు, బిసి నాయకులు క్రాంతి, ప్రవీణ్,వెంకన్న,నాయకులు అంకేశ్వరపు రామచందర్,బొల్లం రాంకుమార్, బి.నాగరాజు, ఉదయ్,సుదమళ్ళ విష్ణు, పొనుగంటి లక్ష్మీ నారాయణ, సంపతి రఘు,విక్రమ్,మనోజ్ కుమార్ ,సాయి,అశోక్,చిట్టిమళ్ళ మహేష్,నందు,తదితరులు పాల్గొన్నారు.
