ఎన్టీఆర్ స్టేడియంలో పలువురు పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత…..
Thovva web news.in.26.jan.2024.

జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ సంగ్రంసింఘ్ జీ పాటిల్ మహాత్మా గాంధీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ నాయకులు దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ శాంతి భద్రతల ను ప్రథమ కర్తవ్యంగా విధి నిర్వహించాలని రాజ్యంగ హక్కులను ప్రతి పేదవాడికి అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ .డిఎస్పీ లు సిఐ లు ఎస్సై లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్టేడియంలో
75వ గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొనీ పోలీసు శాఖ విధి నిర్వహణలో అంకితభవంతో పనిచేసిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు అనంతరం ఎస్పీ కలెక్టర్ అధికారులతో కలిసి పోలీస్ విభాగం ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు.
