గిరిజన యువత మీడియా వైపు రాణించడం శుభ పరిణామం
టిడబ్ల్యూజేఏ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో. ఎమ్మెల్సీ “తక్కేలపలి రవీందర్రావు“

ప్రస్తుత సమాజంలో గిరిజన జర్నలిస్టుల పాత్ర ఎంతో అవసరమని ఎమ్మెల్సీ తక్కిలపెల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో గిరిజనులు చాలా అంశాల్లో వేనుకబడి ఉన్నారని అలాంటి సామాజిక వర్గం నుంచి గిరిజన యువత మీడియా వైపు రాణించడం చాలా శుభ పరిణామమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ
ఆణగారిన వర్గాల వేతలను సమస్యలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా గిరిజన జిల్లా అయినా ఈ ప్రాంతంలో గిరిజన జర్నలిస్టుల సమాజానికి ఎంతో అవసరం అన్నారు. రానున్న రోజుల్లో గిరిజన జర్నలిస్టులకు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింతనూరి శ్రీనివాస్, టిడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షులు తేజావత్ రవి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్రీనివాస్ నాయక్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యదర్శి గాడి పెళ్లి శ్రీహరి, టిడబ్ల్యూజే ఏ జిల్లా లీగల్ ఇన్చార్జి భూక్య మోహన్, ఆంగోత్ చందులాల్, పట్టణ అధ్యక్షులు తేజవత్ శ్రీనివాస్, బోడ శ్రీనివాస్ నాయక్, తిరుపతి నాయక్, శ్రీ కుమార్, శ్రీనివాస్, మాజీ వన్యప్రాణుల సంరక్షణ మండలి సభ్యులు బానోతు రవికుమార్, మహబూబాబాద్ సీనియర్ కౌన్సిలర్ మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
