మండల నోడల్ H.M రామ్మోహనరావు
thovva web news.in//27.Jan .sat

ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అభిరుచిని కలిగి వుండాలని మండల నోడల్ H.M రామ్మోహనరావు అన్నారు.
శనివారం నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక , ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రశ్నా పత్రం ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పట్ల అభిరుచిని , ఆసక్తిని , ఇష్టాన్ని కలిగి ఉండాలని , వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణ లను చేయాలని , మూఢనమ్మకాలను నమ్మవద్దు అని అన్నారు.
అనంతరం జనవిజ్ఞానవేదిక మండల బాధ్యులు శేషుకుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్టు లో ఇంగ్లీషు మీడియం నుండి పెద్దనాగారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు M.శివ చంద్ర , A.భరత్ , A. స్వామిక లు , తెలుగు మీడియం నుండి కస్తూరిభాగాంధీ బాలికా విద్యాలయం నర్సింహులపేట నుండి B. వైష్ణవి, K. ధనలక్ష్మీ , G. సంజన లు విజేతలు గా నిలిచి వచ్చే నెల ఫిబ్రవరి 3 వ తేదీన జిల్లా స్థాయి లో జరిగే చెకుముకి టాలెంట్ టెస్టు లో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి , నరేందర్ , రాజు , కృష్ణ , సతీష్ కుమార్ , ప్రభాకర్ , భాగ్యలక్ష్మి , సునీత , శ్రావణి తదితరులు పాల్గొన్నారు.