రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో.. కొత్త పాలకవర్గానికి ఎత్తులు
జిల్లాలోని మున్సిపాలిటీలో ఆ దిశగా అడుగులు….
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మద్దతు….
Thovva web news.in 27Jan sat

కొత్తప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అవిశ్వాసాలు మరింత జోరుందుకున్నాయి. అవిశ్వాసాలకు అంతర్గత కారణాలు ఏమైనప్పటికీ ఛైర్మన్లు వైస్ చైర్మన్ లు ఇష్టారాజ్యంగా ఒంటెద్దు పోకడలే ప్రధానంగా కారణాలని కౌన్సిలర్లు తేల్చి చెబుతున్నారు. మున్సిపాలిటీ నిధులు పక్క దారి పట్టించి అభివృద్ధికి వినియోగించకుండా రాజ్యాంగ విరుద్ధమైన స్వయం ప్రతి పత్తి కలిగిన పురపాలికల్లో ఎమ్మెల్యే ల పెత్తనం చేసేలా వ్యవహరించారనీ.అసంతృప్త కౌన్సిలర్ల నుంచి ఆరోపణలూ వెల్లువెత్తాయి ప్రభుత్వం మారినా వెంటనే రాష్ట్రంలో రెండు మూడు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు ప్రవేశ పెట్టి
నెగ్గగా మరికొన్ని చోట్ల వీగిపోయాయి. గత ప్రభుత్వంలో రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా రాష్ట్రం లో గులాబీ పార్టీ చెప్పినదే వేదం చేసినదే చట్టం గా తన పర భేదం లేకుండా చైర్మన్ లకు స్థానిక ఎమ్మెల్యే లకు వ్యతిరేకంగా వ్యవహరించిన కౌన్సిలర్ల పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులకు గురిచేశారు. కొంత మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని నాయన భయాన లొంగదీసుకున్నారు…. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. .పురపాలికల్లో అదే తీరుగా మార్పు రావాలని అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల కోరుకుంటున్నారు.

*మహబూబాబాద్ జిల్లా లో*
జిల్లాలో 4మున్సిపాలిటీ లో గత గులాబీ పార్టీ పాగ వేసి తమకు ఇష్టమైన . చెప్పుచేతల్లో వుండే నాయకులను చైర్మన్ వైస్ చైర్మన్ లుగా పెట్టుకొని మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే లు పెత్తనం చలాయించారు రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కలిగిన పురపాలికలు అధికారులను సిబ్బంది నీ బెదిరించి మరి తమ పనులు పూర్తి చేసుకున్నారు.కొన్ని చోట్ల గ్రీన్ లాండ్ లను కబ్జా చేసే యత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మరికొన్ని చోట్ల టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కు అయ్ ఇంటి పర్మిషన్ లకు కాసుల కోసం కక్కుర్తి పడి పర్సెంటిజి లు తీసుకున్నారు. ఇక గత ప్రభుత్వంలో తమ పాచికలు పారనీ కౌన్సిలర్ల కొత్త ప్రభుత్వ ప్రజ ప్రతినిధుల మద్దతు తో ఏకంగా అవిశ్వాస తీర్మానాలకు తెరలేపారు… జిల్లాలో మహబూబాబాద్ డోర్నకల్ మరిపెడ తొర్రూరు లో మహబూబాబాద్.మరిపెడ తొర్రూరు లో అవిశ్వాస నికి రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది అందుకు అనుగుణంగా మానుకోట పుర పాలికల్లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు పోసగడం లేదని ఎన్నికల ముందు వరకు బాగానే ఉన్నా. ఎన్నికల సమయంలో చైర్మన్ ను పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యే మద్దతు తో తనే చైర్మన్ గా వ్యవహరించాడని. మిగతా కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. అంతే కాకుండా 4ఏండ్ల పదవి కాలంలో అభివృద్ధి నిధులు ఎక్కువ మొత్తంగా స్వాహా చేసినట్టు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నాయ్ ఏకంగా మాజీ ముఖ్య మంత్రి 50 కోట్ల నిధులు ఇస్తే అవి జీవో కే పరిమితమా. లేక నిధులు దారి మళ్లించారా తేలాల్సి వుంది.ఈ దరిమిలా పదవి కాలం ఇంకో యేడాది కాలం వున్నందున కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని అందుకు మద్దతుగా వామపక్షాలు అవసరమైతే అసంతృప్త గులాబీ కౌన్సిలర్ల కూడగట్టే యత్నం లో అధికార పార్టీ యత్నిస్తున్నిటు విశ్వసనీయ సమాచారం.మరిపెడ లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్త చైర్మన్ ను పెట్టాలని చూస్తున్నా అందుకు తగిన నాయకులు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.గులాబీ గూటిలో వున్న అంగ అర్ధబలం వున్న కౌన్సిలర్ల లను తిప్పుకోవాలనే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇక పోతే మానుకోట పురపాలక తర్వాత అంతా ప్రాధాన్యత ఉన్న మున్సిపాలిటీ తొర్రూర్ ఇక్కడ ఎన్నికలకు ముందు ఉంటా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు చెప్పినట్టే నడిచేది కానీ ప్రస్తుతం దయాకర్ రావును ఓడించి పాలకుర్తి జేజమ్మగా పేరుపొందిన ఝాన్సీ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలతో తొర్రూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని అందుకు అనుగుణంగా కౌన్సిలర్లను సమయత్తాం చేస్తూ రాజకీయ సమాలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో అత్యధిక పురపాలికలు, నగరపాలక సంస్థలు బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మధ్య అంతర్గత విభేదాలతో పాటు ఛైర్పర్సన్లను దక్కించుకునే క్రమంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు కూడగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ కౌన్సిలర్లను కార్పొరేటర్ లను తిరిగి పార్టీలకు తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానాల కోసం నోటీసులు ఇప్పించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఎది ఏమైనా గులాబీ పార్టీ అవకాశం వచ్చినప్పుడు వారు చేసిన విధంగా అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ చేయడంలో తప్పేముందని ప్రజలు అనుకుంటున్నారు…
తొవ్వ న్యూస్ వెబ్…

