దారుణ హత్యల తో రక్త మొడ్డుతున్న విశ్వనగరం…
రౌడీ షీట్లర్లు.గ్యాంగ్ వార్ లు .వివాహేతర సంబంధాలు… కారణంగా దురాగతాలు…
నగరం లో చంపేస్తున్నరా..? ఎక్కడో చంపేసి ఇక్కడ వేస్తున్నారా… తెలియాల్సి వుంది…!
Thovva web news. jan.29.mon…. kutbhulapur…

ప్రపంచంలోనే విశ్వ నగరం గా క్యాతికెక్కి బతుకు దెరువు కు వచ్చిన వారికి అక్కున చేర్చుకునే హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వరుస హత్యోదంతలతో రక్తమొడ్డుతుంది. రౌడీ షీటర్ గ్యాంగ్ వార్.ల వివాహేతర సంబంధాల హత్యలతో సంచలనం కలిగిస్తున్నాయి. తమకు గిట్టని వారిని ఎక్కడో చంపేస్తు మృతదేహాలను తీసుకొచ్చి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేస్తున్నారనే అనుమానాలు.నిఘా విభాగం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మృతదేహాల్ని గుర్తించలేకుండా, ఆనవాళ్లు దొరక్కుండా దహనం చేసేస్తున్నారు. ఈ ఏడాది 28 రోజుల్లో శివార్లలో ఇప్పటివరకు గుర్తు తెలియని మూడు మృతదేహాలు వెలుగుచూశాయి. ఆదివారం ఉదయం జవహర్ నగర్ ఠాణా పరిధిలోని కౌకూర్ అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం
వెలుగుచూసింది. ఈ తరహా ఉదంతాల్లో
నిందితులు, మృతులను గుర్తించడం పోలీసులకు
సవాల్గా మారుతోంది.నేరస్థులు హత్యలు చేసేందుకు.. మృతదేహాల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు శివారు ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలో బీటెక్ విద్యార్థి నవీన్ ను అతడి స్నేహితుడు
హరిహర అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో కిరాతకంగా హత్య చేశాడు. జన సంచారం చాలా తక్కువగా ఉండడం.. ఎలాంటి నేరం చేసినా పసిగట్టే వ్యవస్థలు లేకపోవడంతో నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. చంపేశాక ఆనవాళ్లు లేకుండా మృతదేహాల్ని తగలబెడుతున్నారు. దీంతో స్థానికులు ఎవరైనా గుర్తించి సమాచారమిచ్చినప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సూరారంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గుర్తించారు. ముఖ్యంగా మహిళలు ఇతరులతో వివాహేత సంబంధాలు పెట్టుకుని తాళి కట్టిన భర్తలను దారుణంగా హత్య చేయించి నిర్మానుష ప్రాంతాల్లో జరుగుతుంది. గత సంవత్సరం ఒక పూజారిని హత్య చేసి ఆత్మహత్య గా క్రియేట్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్ చుట్టూరా నేరాలు అధికంగా జరుగుతున్నాయి ఇటీవల రాష్ట్ర క్రైమ్ శాతం లో కూడా వేలువడింది
*నేరాలు ఘోరాలు*
ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి
పాలిథిన్ సంచిలో చుట్టి పెట్రోల్ పోసి కాల్చేసిన
ఘటన జవహర్ నగర్ ఠాణా పరిధిలో ఆదివారం
వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల
ప్రకారం.. బాలాజీనగర్ వికలాంగుల కాలనీ-కౌకూరు
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు
గురైనట్లు స్థానికులు 100కు సమాచారం
అందించారు. ఎక్కడో చంపి ఆనవాళ్లు
గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు
పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి
వయస్సు 30-35 ఏళ్లు ఉంటుందని పోలీసులు
భావిస్తున్నారు. శనివారం రాత్రి ఆ వ్యక్తిని మరో
ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి
నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల
అదృశ్యమైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు
అధికారులు తెలిపారు.దీనికి తోడు వివాహేతర సంబంధాలు తో మరిన్ని హత్యలు జరుగుతున్నాయి. బార్య భర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వెలువడగానే మరొకరితో సంబంధాలు నేర్పడం సుపరిలు ఇచ్చి భర్తలను హత్యలు చేయించడం జరుగుతుంది.కొన్నిప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా హత్యలను కనిపెట్టడం సాధ్యమవుతుందిమరికొన్ని చోట్ల హత్యలు జరిగినా చాలారోజుల వరకు తెలియడం లేదు అలాంటి మిస్సింగ్ కేసులు చాలానే వున్నాయి..పూర్తి స్థాయిలో విశ్వ నగరంలో హత్యలకు ఆధారాలు కనిపెట్టి ప్రజలకు శాంతి భద్రతలపై పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వాలని విశ్వనగర ప్రజలు కోరుతున్నారు..
*Thovva web news .in