గ్రామ పంచాయతీ సర్పంచులకు సన్మానం….
Thovva web news.in.30.jan.Tue..


రాష్ట్రంలో రేపటితో పంచాయితీ పాలకవర్గం పదవులు ముగుస్తుండడంతో సోమవారం రోజున గ్రామ పంచాయితీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వార్డు సభ్యులు పంచాయితీ సిబ్బంది కలసి సర్పంచ్ శ్రీమతి వేముల రజిత రెడ్డిని, ఉప సర్పంచ్ నాగన్న లను శాలువాతో సన్మానం చేశారు. అనంతరం సర్పంచ్ రజిత ఉప సర్పంచ్ కర్ల నాగన్న ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి కలిసి వార్డు సభ్యులు పల్లె సునీత, కొండబత్తిని అనసూర్య, వడ్డెపల్లి నాగలక్ష్మి, ఆకుతోట నరేష్, కొండ బత్తిని ఉమ, ఎల్లవుల ఉపేందర్, అలవాల నాగమణి, షేక్ మదార్ మరియు బి. శంకర్ లకు పంచాయితీ కార్యాలయం లో సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో పాలక మండలి సభ్యులు, పంచాయితీ కార్యదర్శి, కారోబార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
