ఆటో సీజ్ నలుగురు వ్యక్తుల అరెస్ట్…
Thovva web news 30.Jan Tue…

నర్సింహుల పేట మండల కేంద్ర శివారు జయపురం క్రాస్ రోడ్డు వద్ద ఆటో లో అక్రమంగా తరలిస్తున్న గొర్రెలు,మేకల దొంగలను పట్టుకొని ఆటో సీజ్..నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తొర్రూరు సి ఐ సత్యనారయణ అన్నారు..మంగళవారం నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ
వంతడుపుల తండా కి చెందిన ధరవత్ రూపుసింగ్ తన ఇంటిముందు కట్టేసిన మేకపోతు నీ ఎవరో గుర్తు తెలియని దొంగలు తీసుకొని వెళ్లారనీ గతంలో పిర్యాదు చేయగా అట్టి దొంగతనం పై నర్సింహులపేట Si గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తుండగా ఈరోజు వాహన తనిఖీలో బాగంగా జయపురం ‘X’road వద్ద ఆటో లో గొర్రెలు మేకలు వేసుకొని వెళ్తున్న ఆటో అనుమానస్పదం గా కనిపించిదని వివరాలు అడుగగా అందులో వున్నా నలుగురు పొంతన లేని సమాదానాలు చెప్పుతుండటం తో విచారించగా వారు అ మేకలు గొర్రెలు దొంగతనం గా తీసుకొచ్చినవి అని చెప్పినరని గత కొంత కాలంగా వీరు మరిపెడ, నర్సింహులపేట, తొర్రురు మండలాలలో ఇంటి ముందు కట్టేసిన మేకలను, గొర్రెలను దొంగతనం చేస్తున్న నలుగురు వ్యక్తులు గా గుర్తించడం జరిగిందని వారు భూక్యా హరికృష్ణ, గుగులోత్ గణేష్, గుగులోత్ సుమన్, గుగులోత్ కళ్యాణ్ లు ను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 05 మేకలు, 04 గొర్రెలు మొత్తం 09 (సుమారు 1,లక్ష 50000 )విలువైనవిగా గుర్తించి స్వాధీన పర్చుకోవడం తో పాటు దొంగతనం కి ఉపయోగించిన ఆటో నీ జప్తు చేయడమైంది.నిందుతులను పట్టుకోవడం లో ప్రతిభ చూపిన ASI.వెంకన్న, Hc సంతోష్, Hc వెంకన్న pc శ్రీను, Pc రమేష్ Pc రమేష్ లను తొర్రరూ DSP వెంకటేశ్వరబాబు, Ci సత్యనారాయణ అభినందించారు.